వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా.. అటు టీవీ షోలు.. ఇటు రాజకీయాలు.. రెండింటినీ మేనేజ్ చేసుకుంటూనే పర్సనల్ లైఫ్ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నారీమె. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమె మరింత బిజీ అయ్యారు. అయినప్పటికీ టీవీ షోలను, ప్రేక్షకులను వదిలిపెట్టకుండా కంటిన్యూ అవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతిపక్షాలపై ఉగ్ర రూపం చూపిస్తూ, టీవీ షోల్లో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇక తాజాగా మరో కొత్త షోతో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి రెడీ అవుతున్నారు.
ఇన్ని రోజులూ ప్రతీ వారాంతం ఒక సరికొత్త సినిమాతో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను అందించిన జెమినీ టీవీ ఇప్పుడు ప్రతీ రోజు ఆ ఎంటెర్టైన్మెంట్ ను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. సోమవారం నుంచి శనివారం వరకు మొత్తం ఐదు సరికొత్త షోలతో ఎలెక్ట్రిఫయింగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రచారం చేశారు. ఇందులో భాగంగా మొన్నటికి మొన్న `తల్లా పెళ్ళామా` అంటూ యాంకర్ అనసూయ ప్రోమో విడుదల చేశారు. ఈ షో మార్చ్ 2 సోమవారం మొదలుకానుంది. ఇక ఇప్పుడు రోజక్క ఛాన్స్ వచ్చింది. రోజా యాంకర్ గా చేస్తున్న మరో అదిరిపోయే షో టెలికాస్ట్ కు సిద్ధంగా ఉందని ఓ ప్రోమోను విడుదల చేశారు.
అందులో మోడ్రన్ తల్లులు వారి పిల్లలతో చేసే సందడినే ఒక షోగా మలిస్తే ఎలా ఉంటుందో ఈ షో ద్వారా చూడనున్నారు. ఒక్క గ్రామ్ ఎనిమిది మంది మధ్య యుద్ధం తాలుకా బొమ్మ దద్దరిల్లిపోద్ది అంటూ మహేష్ పేల్చిన డైలాగ్ ను రోజా ఈ షో ద్వారా అదరగొట్టేసాడు. ఇక ఈ షో పేరు కూడా మహేష్ బాబు సినిమా పేరే. `అమ్మ సరిలేరు నీకెవ్వరు` అంటూ రోజా బుల్లితెర ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచడానికి రెడీ అవుతోంది. మరి ఈ షో కూడా సరిలేరు సినిమా రేంజ్ లో ఉంటుందో లేదో తెలియాలంటే వచ్చే మార్చ్ 3 రాత్రి 9:30 గంటల వరకు వేచి చూడాల్సిందే.
ప్రేక్షకులందరిని అలరించడానికి సరికొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు ఈ మర్చి 3 వ తారీఖున రాబోతున్నాము. మీరు రెడీ ఆ?#Gemini #GeminiSocial pic.twitter.com/ZcP7L2U7C4
— Gemini TV (@GeminiTV) February 25, 2020