2020 త్రివిక్రమ్ దే. అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్ ను సెట్ చేశాడు. బాహుబలి తర్వాత 150కోట్లు దాటిన సినిమా ఇదే. అదిరిపోయే రికార్డ్ సొంతం చేసుకున్నా.. త్రివిక్రమ్ ఓ విషయంలో మాత్రం వెనుకబడిపోయాడు. తోటి దర్శకులందరూ దూసుకుపోతుంటే.. త్రివిక్రమ్ ఎందుకు అటుగా అడుగులు వేయలేకపోతున్నాడు. 

 

తెలుగులో సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువున్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకడు. అజ్ఞాతవాసి మినహాయిస్తే.. ప్రతి సినిమాతో అలరిస్తూనే ఉన్నాడు. ఆయన కథలన్నీ ఫ్యామిలీ చుట్టూ తిరిగినా.. కథనంతో, మాటలతో మాయచేస్తూ మెప్పిస్తాడు త్రివిక్రమ్. అందుకే తెలుగులో స్టార్ డైరెక్టర్స్ పేరు చెప్పమంటే.. టాప్ త్రీలో త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తుంది. 

 

తెలుగు ప్రేక్షకులను ఇంతలా అలరిస్తున్న త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీస్ పై ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. బాహుబలి మూవీతో రాజమౌళి పాన్ ఇండియాకు తెరలేపాడు. చిరంజీవితో సురేంద్ర రెడ్డి తీసిన సైరా ఇలాంటి చిత్రమే. విజయ్ దేవరకొండతో పూరీ తీసే సినిమా కూడా పాన్ ఇండియానే. ఇలా దర్శకులందరూ అటుగా చూస్తుంటే త్రివిక్రమ్ మాత్రం.. తెలుగు ప్రేక్షకులకే పరిమితమవుతున్నాడు. 

 

అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. మేలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అయిననూ పోయిరావలె హస్తినకు అన్న టైటిల్ పరిశీలిస్తున్నారు. టాలీవుడ్ పరిధి దాటకుండా కథలు రాసుకున్న ఈ దర్శకుడు.. ఎన్టీఆర్ మూవీతో అయినా.. తన కలానికి.. టేకింగ్ కు పాన్ ఇండియా పవర్ ఉందని నిరూపిస్తాడో లేదో చూడాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు టాలీవుడ్ మంచి క్రేజ్ ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందించే దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. అదే ఇపుడు ఆయన సినిమాలకు ప్రేక్షక లోకాన్ని థియేటర్ల బాట పట్టిస్తోంది. అయితే తన టాలెంట్ టాలీవుడ్ కే పరిమితమవుతుందా.. లేక బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ లో దూసుకుపోతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: