పవర్ స్టార్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ ల మీద సర్ ప్రైజింగ్ లు ఇస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అయితే ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కే పవన్ మరోసారి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

 

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎకనామికల్ గా అవసరం కోసం సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చాడు. రాజకీయాలు చేస్తూనే సినిమాలు చేసి నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలకు ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో రెండు సినిమాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 

 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. దీంతో పాటు క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నాడు. అలాగే హరీశ్ శంకర్ తో అనౌన్స్ చేసిన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దీంతో పాటు ఇప్పుడు పవన్ 29వ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాతకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు పవన్ సిద్ధమయ్యాడట. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ డైరెక్షన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఇంతకు ముందు వర్క్ చేసిన డైరెక్టర్ తో మరో న్యూ మూవీ ఉంటుందట. 

 

పవన్ కళ్యాణ్, దర్శకుడు బాబీతో గోపాల గోపాల చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. పవన్, బాబీ కాంబినేషన్ లో వచ్చిన కాటమరాయుడు ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ బాబీ మీదున్న ఇష్టంతో పవన్ మరోసారి ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. ప్రతీ సినిమాకు పవర్ స్టార్ రెండు మూడు నెలల డేట్స్ మాత్రమే ఇచ్చాడట. అందుకే వచ్చే ఎన్నికల లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేలా ప్రణాళికలు వేసుకున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: