రెబల్ స్టార్ ప్రభాస్ ,మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తన 21 వ చిత్రాన్ని చేయనున్నాడని తెలిసిందే. ఈఫ్రెష్ కాంబినేషన్ పై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక
బాహుబలి నుండి
ప్రభాస్ సినిమాలన్నీ తెలుగు తో పాటు ఇతర భాషల్లో దేశ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి. అయితే ఈ 21వ చిత్రం మాత్రం ఫ్యాన్
ఇండియా మూవీ కాదని అంటున్నాడు నాగ్ అశ్విన్.
సినిమా గురించి స్పందిస్తూ.. షూటింగ్ ఈఏడాది చివర్లో స్టార్ట్ కానుంది వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదలచేస్తామని తెలిపిన నాగ్ ఇది ఫ్యాన్
ఇండియా సినిమా కాదని ఆ రేంజ్ ను
ప్రభాస్ ఎప్పుడో దాటిపోయాడు ఇది ఫ్యాన్ వరల్డ్
సినిమా డార్లింగ్స్ అంటూ పేర్కొన్నాడు. భారీ బడ్జెట్ తో
వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఇక
మహానటి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న
నాగ్ అశ్విన్ ప్రస్తుతం
నిర్మాత గా మారి జాతిరత్నాలు అనే సినిమాను నిర్మిస్తున్నాడు.
నవీన్ పోలిశెట్టి,
రాహుల్ రామకృష్ణ ,ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రాన్ని పిట్టగోడ ఫేమ్ అనుదీప్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా కృష్ణంరాజు ,సీనియర్ నటి భాగ్య శ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ ను పెట్టనున్నారని సమాచారం. ప్రభాస్ హోమ్ బ్యానర్ గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. దసరా కు ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.