మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సైరా సినిమా మొదలైనప్పటి నుంచి కొరటాల ఈ సినిమాకోసం, మెగాస్టార్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకి ఈ సినిమా ప్రారంభమైంది. మెగాస్టార్ ని ఇప్పటి వరకు చూడని విధంగా కొరటాల చూపించబోతున్నారట. ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతు సినిమా మీద భారీగా అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా ఎరగని కొరటాల ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు మెగాస్టార్ తో సినిమా కావడంతో ఎంతగానో శ్రమిస్తున్నారట. 

 

ఇక ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం చరణ్ నటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే చరణ్ గనక ఆ పాత్ర చేయాలంటే ఆర్.ఆర్.ఆర్ కంప్లీటయ్యో వరకు ఆగాల్సిందే అని తేలింది. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా ఎటువంటి పరిస్థితిలోను ఈ సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని జక్కన్న శ్రమిస్తున్నారు. దాంతో చరణ్ మెగాస్టార్-కొరటాల సినిమాలో నటించలేకపోతున్నాడట. 

 

దాంతో ఈ పాత్రలో మహేష్ బాబు నటిస్తే బావుంటుందని కొరటాల శివ-మెగాస్టార్ భావించారట. ఇదే విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర ప్రస్తావిస్తే పాత్ర నచ్చితే మెగాస్టార్ తో కలిసి సూపర్ స్టార్ నటించడానికి సిద్దమని చెప్పాడట. దాంతో ఈ విషయలో కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి గాని అఫీషియల్ గా న్యూస్ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ నటిస్తున్నారని అధికారకంగా తేలిపోయింది. ఈ సినిమాకోసం మహేష్ బాబు 25 రోజులు క్వాల్షీట్లు ఇచ్చారు. సూపర్ స్టార్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ ఇద్దరు కలిసి మహర్షి సినిమాలో నటించిన సగంతి తెలిసిందే. ఇక పెద్ద షాకింగ్ విషయం ఏమిటంటే మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ నటించడానికి ఒప్పుకున్నందుకు 40 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.

 

ఈ న్యూస్ అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి టన్నుల కొద్ది ఉత్సాహాన్నిస్తోంది. ఇక మహేష్ ఈ సినిమాలో మే రెండవ వారం నుండి జాయిన్ కాబోతుండగా విజయదశమి లేదా దీపావళికి రిలీజ్ కాబోతోంది. ఇక న్యూస్ వచ్చినప్పటి నుంచి మన తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీకి షాకులివ్వబోతోందని మాట్లాడుకుంటున్నారు. ఈ రేంజ్ భారీ మల్టీ స్టారర్స్ బాలీవుడ్ లోనే కాదు ఇకపై టాలీవుడ్ లో రాబోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: