టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన నిర్మాత దిల్ రాజు. ఇండస్ట్రీలో గాని ప్రేక్షకుల్లో గాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది దిల్ రాజు. ఒక నిర్మాతగా సినిమా ప్రమోషన్స్ కి కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ కి బయటకు కనిపించేది ఆయనే కావడంతో ఈ బ్యానర్ కి అంతా దిల్ రాజుగారే అని చాలామంది అనుకుంటున్నారు. అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో దిల్ రాజు- శిరీష్ - లక్ష్మణ్..ఉన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. వాస్తవంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కి ఈ ముగ్గురూ కీలక పాత్ర పోషిస్తారు. సినిమాని నిర్మించడంలోనే కాదు ఆ సినిమాని డిస్ట్రిబ్యూషన్.. థియేటర్స్ విషయంలోను ముగ్గురూ ఒకే మాట మీద ఉంటూ ఇరవై ఏళ్ళ నుండి విజయవంతంగా తమ అనుబంధం కొనసాగించారు. అయితే ఈ కాంపౌండ్ చీలిక వస్తోందని ఫిల్మ్ నగర్ లో గత కొన్ని రోజుల నుండి టాక్ వినిపిస్తోంది.

 


 లక్ష్మణ్ ఈ గ్రూప్ లో నుంచి బయటకు వస్తున్నారని.. సొంత నిర్మాణ సంస్థ మొదలు పెట్టే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే ఇరవై ఏళ్ళ నుండి కలిసి ఉన్న వీళ్ళు ఇప్పుడు అర్ధాంతరంగా విడిపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. సినిమాల క్రెడిట్ అంతా రాజుగారి ఖాతాలో పడుతూ ఉండడం.. రాజుగారికి తప్ప తనకు నిర్మాతగా పేరు రాకపోవడంతో లక్ష్మణ్ అప్సెట్ అయ్యారని అంటున్నారు. టాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్థ అయిన వెంకటేశ్వర క్రియేషన్స్ లో మార్పులు చోటు చేసుకోవడం తథ్యం అని అంటున్నారు.

 

ఇదిలా ఉంటే థియేటర్ లీజ్ అగ్రిమెంట్స్ మొత్తం లక్ష్మణ్ పేరు మీదే ఉన్నాయని దీంతో ఈ చీలిక వస్తే మాత్రం థియేటర్ల విషయంలో రాజుగారికి ఇంతకు ముందు ఉన్నంత గ్రిప్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఏదేమైనా దిల్ రాజు కాంపౌండ్ లో ఇలా ముగ్గురూ విడిపోవడం సినిమా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇదే గనక జరిగితే రాజు గారి పరిస్థితి కష్టమే అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: