టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్‌ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 2021 జనవరిలో 'ఆర్ఆర్ఆర్' సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని అధికారికంగానే ప్రకటన వచ్చేసింది. కానీ ఇన్నాళ్ళు రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది డైలమామాలో ఉండింది. ఆ విషయంలో క్లారిటీ వచ్చేసిందని తాజా సమాచారం. 

 

ఛలో, భీష్మ సినిమాలతో సక్సస్ లను అందుకున్న వెంకీ కుడుముల రాం చరణ్ కి కథ చెప్పాడని లేటెస్ట్ న్యూస్. ఈ కథ చరణ్ కి విపరీతంగా నచ్చడంతో వెంటనే పచ్చ జెండా ఊపేశాడట. చరణ్ కి వెంకీ కుడుమల చెప్పినకథ లో ఫస్టాఫ్  నెరేషన్ అదిరిపోయిందట. ఇక సెకండాఫ్ లో చిన్న చిన్న మార్పులతో మళ్ళీ చరణ్ ని కలవనున్నాడట వెంకీ కుడుమల. ఈ మార్పులు చరణ్ ఒకే చేస్తే కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తాడు. ఈ లోపు రాజమౌళి కంప్లీట్ చేసుకొని వస్తాడు చరణ్.

 

అందుకే వెంకీ కుడుముల కథ నచ్చగానే నీ స్క్రిప్ట్ అదిరింది వెంకీ ఆర్.ఆర్.ఆర్ కంప్లీట్ చేసుకొని వస్తా బీ రెడీ అన్న రాం చరణ్ .. ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్దంగా ఉండమని చెప్పాడట. ఇక 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ చేయబోయో సినిమా ఇదేనని తెలుస్తోంది. ఈ లోపు ఏదైనా మార్పులు జరిగితే విక్రం కె కుమార్ ప్రాజెక్ట్ ముందు పట్టాలెక్కే అవకాశం ఉంది. లేదంటే మాత్రం చరణ్ - వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ముందుగా ట్రాక్ లోకి వచ్చేస్తుంది. ప్రస్తుతానికి చరణ్ అఫీషియల్ గా అనుకుంటుంది ఈ రెండు ప్రాజెక్ట్స్ మాత్రమే. ఇక ఈ సినిమాలకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: