బాలీవుడ్ సినిమా పరిశ్రమలో  ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో దీపికా పడుకొనే కూడా ఒకరు. స్వతహాగా బెంగళూరుకి చెందిన దీపికా, తొలుత ఉపేంద్ర సరసన ఐశ్వర్య అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించింది. అయితే ఆ తరువాత ఆమెకు ఏకంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ సరసన ఓం శాంతి ఓం లో అవకాశం రావడం, ఆ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించడంతో దీపికా కు బాలీవుడ్ లో కూడా మంచి పేరు దక్కింది. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన దీపికా, మెల్లగా అక్కడి స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేస్తూ వెళ్ళింది. 

 

ఇక అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న దీపికా, ఆ మధ్య హాలీవుడ్ మూవీ ట్రిపుల్ ఎక్స్ లేటెస్ట్ వెర్షన్ లో ఒక ప్రధాన పాత్రలో కూడా నటించింది. ఆ విధంగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న దీపిక, ఇటీవల బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ని ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకుంది. అయితే స్వతహాగా బెంగళూరు అమ్మాయి కావడంతో తనకు కూడా సౌత్ లో ఒక మంచి సినిమా అవకాశం వస్తే నటించాలని ఎదురుచూస్తున్నట్లు ఇప్పటికే దీపికా పలు మార్లు చెప్పడం జరిగింది. ఇకపోతే తనకు తెలుగులో మహేష్, ప్రభాస్ వంటి నటులు అంటే ఎంతో ఇష్టం అని పలు మార్లు చెప్పిన దీపికా, నిన్నటి ఒక మీడియా సమావేశంలో తన సినిమా కెరీర్ గురించి మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానము ఇవ్వడం జరిగింది. 

 

అయితే వారిలో ఒక మీడియా మిత్రుడు, మీరు సౌత్ లో నటించాలని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు కదా, ఒకవేళ మీకు ఇప్పుడు మహేష్, లేదా ప్రభాస్ ప్రక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే చేస్తారా అని అడగ్గా, నిజానికి నాకు ఇటీవల సౌత్ లో, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో అక్కడక్కడా మాత్రమే ఆఫర్లు రావడం జరిగిందని, అయితే తనకు డేట్స్ ఖాళీ లేకపోవడం వలన వారికి కమిట్ కాలేకపోయానని ఆమె అన్నారు. ఇక మహేష్, ప్రభాస్ ల సరసన ప్రస్తుతం కనుక ఛాన్స్ వస్తే వదులుకోవడానికి నాకేమైనా పిచ్చెక్కిందా, నేనే కాదు చాలా వరకు ఏ హీరోయిన్ కూడా అటువంటి ఛాన్స్ ని వదులుకోదు అంటూ మాట్లాడడం జరిగిందట....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: