మన టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఇప్పటివరకు ఎందరో నటీనటులు, సాంకేతికనిపుణులు రావడం జరిగింది. అయితే వాటిలో కేవలం కొందరు మాత్రమే మంచి సక్సెస్ ని సాధించి ప్రజల మనసులో మంచి చోటు సంపాదించారు. ఇక ముఖ్యంగా ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించే నటీనటుల్లో ఇంకొందరు అయితే ప్రజల నుండి విశేషమైన స్పందనను అందుకున్నారు. అయితే వారిలో ముఖ్యంగా హీరోయిన్లైన కొందరు, ఇప్పటికీ కూడా మన ప్రేక్షకుల గుండెల్లో తమ ఆకట్టుకునే అందం, అభినయంతో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ముఖ్యంగా హీరోయిన్ కి అభినయంతో పాటు అందం కూడా ముఖ్యమే, అయితే హీరోయిన్లలో కొందరు మాత్రం మేకప్ లేకుండా కూడా ఎంతో అందంగా ఉండేవారు కొందరు ఉన్నారు.

 

ఇక తొలితరం హీరోయిన్స్ లో సావిత్రి, జమున, అంజలీదేవి, షావుకారు జానకి, కృష్ణకుమారి వంటి అగ్ర నటీమణులు అందరూ కూడా ఎక్కువగా మేకప్ ని వాడే వారు కాదట, వీరందరూ కూడా సహజమైన సౌందర్యంతో మెరిసిపోతుండడంతో, కొద్ది మొత్తంలో పైపైన మాత్రమే మేకప్ వేసి, వారి అందానికి మరింత వన్నె తెచ్చేలా అప్పట్లో పలు రకాల నగలు అలంకరించేవారట. ఇక ఆ తరువాత తరంలో వచ్చిన నటీమణుల్లో మేకప్ అవసరం లేని సహజమైన సౌందర్యం గల అందగత్తెల్లో జయప్రద, శ్రీదేవి ల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వారిద్దరినీ మేకప్ లేకుండా చూసిన కొందరు ప్రేక్షకులు ఆశ్చర్యపోయేవారట. అయితే షూటింగ్ సమయంలో లైట్ గా అప్పటికప్పుడు కొద్దిగా మేకప్ అవసరం కోసం వేసుకోవడం తప్ప వారిద్దరిది ఎంతో గొప్ప సౌందర్యం అని ఇప్పటికీ కొందరు చెప్తూనే ఉంటారు. 

 

ఇకపోతే ఆపై వచ్చిన నటీమణుల్లో విజయశాంతి, రజని, ఆ తరువాత గౌతమీ, సౌందర్య, దివ్యభారతి, అమల వంటి వారికి పెద్దగా మేకప్ అవసరం ఉండేది కాదని, అందుకే వీరిని అప్పట్లో బయట చూసిన అభిమానులు వారి అందానికి దాసులయ్యేవారట. ఇక ఆ తరువాత నుండి ఇప్పటివరకు వచ్చిన హీరోయిన్స్ లో దాదాపుగా ఎక్కువమందిని మేకప్ లేనిదే చూడలేమని, అయితే ఎక్కడో ఒక్కరిద్దరు మాత్రమే సహజమైన సౌందర్యం గలవారిని సమాచారం. ఎంతైనా కాలం మారుతోంది కదా, ఇప్పటి పరిస్థితుల్లో ఇంకా సహజమైన అందం అనేది ఎక్కడుంది అని అంటున్నారు విశ్లేషకులు......!!   

మరింత సమాచారం తెలుసుకోండి: