పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో పాటుగా క్రిష్ డైరక్షన్ లో సినిమాకు ముహుర్తం పెట్టేశాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ ఓ బందిపోటుగా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు కూడా పవన్ ఒకేసారి డేట్స్ కేటాయించి తన మీద ఉన్న సీన్స్ అన్ని షూట్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామని తీసుకురావాలని ప్రయత్నించారు. పవన్ కు జోడీగా ఎవరు నటిస్తారన్న విషయం మీద రకరకాల వార్తలు వచ్చాయి.

 

లేటెస్ట్ గా పవన్ తో జోడీ కట్టేది మహానటి అని తెలుస్తుంది. క్రిష్ కీర్తి సురేష్ ను కలిసి చర్చించడం జరిగిందట. మహానటితో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత సినిమాల ఎంపికలో పొరపాట్లు చేసింది. అజ్ఞాతవాసి ఫ్లాప్ అవడంతో కెరియర్ లో వెనుకపడ్డది. పవన్ కళ్యాణ్ తో కీర్తి సురేష్ అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అవడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ పై అనుమానాలు వస్తున్నాయి. 

 

క్రిష్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం బాగా వర్క్ చేశాడట. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. స్క్రిప్ట్ తోనే ఇంత కాన్ ఫిడెంట్ గా ఉన్నారంటే అది ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడో అర్ధమవుతుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ లతో అవమానాలు ఎదుర్కున్న క్రిష్ పవన్ సినిమాను హిట్టు కొట్టి తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు. మరి పవర్ స్టార్, క్రిష్ కలిసి ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తారో చూడాలి. క్రిష్ సినిమాతో పాటుగా తనకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు పవన్. ఆ సినిమా కూడా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: