అనసూయ భరద్వాజ్.. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ఈ హాట్ యాంకర్.. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. చాలా ఏళ్లుగా జబర్ధస్త్ లో స్కిన్ షో తో పాటుగా, తన మాటలతో ఊహించని విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకుంది.. ఇక సినిమాల్లో అప్పుడప్పుడు మెరిసిన అంతగా వర్కవుట్ కాలేదు.. కానీ సుకుమార్ దర్శకత్వంలో, రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా తర్వాత అనసూయ ఇమేజ్ మారిపోయింది.
ఈ చిత్రం విడుదలై రెండేళ్లు కావొస్తున్న ఇప్పటికీ ఆమెను చూసి రంగమ్మత్త అనే చాలా మంది అంటున్నారంటే ఆ పాత్రలో ఆమె ఎంతలా ఒదిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే సుకుమార్ అల్లు అర్జున్ సినిమాలో కూడా అనసూయకు ఒక ముఖ్య పాత్ర ఇచ్చినట్లు సమాచారం.. ఇదిలా ఉండగా ఈ మధ్య నితిన్ కెరియర్కు ఊపిరిపోసిన చిత్రం ‘భీష్మ’.. ఒకవైపు పెళ్లి మరో వైపు వరుస ఫ్లాపులు.. ఇలాంటి సమయంలో ఏ హీరో అయినా కాస్త నెర్వస్గా ఉంటాడు.. అదే నితిన్ విషయంలో జరిగింది. కాని ఏ క్షణాన ‘భీష్మ’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుందో నితిన్ లో జోష్ అందుకోలేనంతగా నిండిపోయింది.. ఇదే ఊపులో ‘అంధాదున్’ మూవీలో నటించడానికి సిద్దమైయ్యాడట నితిన్..
ఇక అంధుడైన వ్యక్తి ఓ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలవడమే కాకుండా నిందితులను చట్టానికి ఎలా పట్టించాడు అనే సస్సెన్ప్ థ్రిల్లర్ కధతో తెరకెక్కనున్నదట.. ఇకపోతే తెలుగు నేటివిటికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి రీమేక్ చేస్తున్న ఈ సినిమాలో నితిన్ అంధుడిగా, ప్లియోనో ప్లేయర్ గా కనించనున్నాడని వినికిడి.... ఇక ఈ సినిమాలో యాంకర్ అనసూయ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందని సమాచారం అందుతోంది. .
బాలీవుడ్ ‘అంధాదున్’లో సీనియర్ నటి టబు అక్రమ సంబంధం పెట్టుకొనే లేడి విలన్ పాత్రలో అద్భుతమైన నాటకీయతను పండించింది. ఈ పాత్రనే అనసూయ చేయనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.. అంటే మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో అక్రమ సంబంధాల ఉచ్చులోపడి అనసూయ విలన్గా మారుతుందన్నమాట.. ఇన్నాళ్లుగా తన గ్లామర్తో కైపెక్కించిన అనసూయ విలన్గా ఏ మాత్రం కిక్కెక్కిస్తుందో చూడాలి..