‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తన లేటెస్ట్ మూవీ చేయబోతున్నాడు అని వచ్చిన ప్రకటన వెనుక చిరంజీవి రాయబారాలు ఫలించాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న జిల్ రాథా కృష్ణ మూవీ షూటింగ్ ను కొనసాగిస్తూనే సందీప్ వంగా సంకల్ప రెడ్డి చెప్పిన కథలతో పాటు లేటెస్ట్ గా వెంకీ కుడుముల కథను కూడ విన్నాడు అంటూ ప్రచారం జరిగింది. 


అయితే వీరందరినీ పక్కకు పెట్టి ప్రభాస్ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటన రావడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఈ వ్యవహారానికి మొత్తం సూత్రధారి చిరంజీవి అని తెలుస్తోంది. ‘మహానటి’ విడుదల తరువాత ఆ సినిమాను చూసిన చిరంజీవి నాగ్ అశ్విన్ పై విపరీతమైన ప్రశంసలు కురిపించాడు.


అంతేకాదు ఒక మంచి కథతో తన వద్దకు వస్తే తాను అవకాశం ఇస్తాను అంటూ ఓపెన్ గానే అప్పట్లో చెప్పాడు. దీనితో చిరంజీవి మాటలు నమ్ముకుని నాగ్ అశ్విన్ దాదాపు సంవత్సరం పాటు ఎంతో ఆలోచించి ఒక సైన్స్ ఫిక్షన్ కథను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఆ కథ కొంత కాలం క్రితం చిరంజీవికి నాగ్ అశ్విన్ వినిపించడంతో ఆ కథ తనకు బాగా నచ్చింది అని చెపుతూ ఆ కథకు తనకంటే ప్రభాస్ అన్ని విధాల సరిపోతాడని అందువల్ల తాను ఆకధ గురించి ప్రభాస్ తో మాట్లాడుతాను అని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఆ తరువాత చిరంజీవి తాను ఇచ్చిన మాట ప్రకారం ప్రభాస్ కు నాగ్ అశ్విన్ తనకు చెప్పిన కథ గురించి వివరించడమే కాకుండా ఆ కథను వినమని ప్రభాస్ కు చెప్పినట్లు టాక్. చిరంజీవి ఇచ్చిన సలహా ప్రకారం ప్రభాస్ ఆ కథ వినడం తన నిర్ణయం చెప్పడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయని ఈ విధంగా నాగ్ అశ్విన్ కు చిరంజీవి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అంటూ ఇండస్ట్రీలో వార్తలు గుప్పు మంటున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: