నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ చిత్రానికి దర్శకత్వం వహించి కళ్యాణ్ రామ్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాన్ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి. రచయితగా కెరీర్ ని ప్రారంభించిన ఈ దర్శకుడు మొదటి సినిమా పటాస్ తో కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారాడు. పటాస్ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్, ఆ తర్వాత స్టార్ హీరో రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా తీసి మంచి విజయాలు అందుకున్నాడు.

 

 

అయితే గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఎఫ్ ౨ చిత్రం అతని కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. దాంతో మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. అయితే ప్రస్తుతం అనిల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేస్తున్నాడనే విషయం ఆసక్తిగా ఉంది. ఎఫ్ 2 సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ చేద్దామని నిర్ణయించుకున్నాడు.

 

 

ఎఫ్ 3 అనే టైటిల్ తో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు రవితేజని మరో హీరోగా తీసుకుని ఎఫ్ 3 చేద్దామని అనుకున్నాడు. కానీ రవితేజ వేరే కమిట్ మెంట్లతొ బిజీగా ఉండడమే గాక రవితేజ మార్కెట్ కూడా బాలేకపోవడంతో నిర్మాత దిల్ రాజు వద్దని వారించాడట. దాని వల్ల ఆ స్థానంలో మరో హీరో కోసం ప్రయత్నం జరుగుతుంది. అనిల్ రావిపుడితో ఎఫ్ 2 సీక్వెల్ అంటే ఏ హీరో అయినా చేయడానికి రెడీగా ఉంటాడు.

 

 

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరోలందరూ తమ తమ కమిట్ మెంట్లతో చాలా బిజీగా ఉన్నారు. అందువల్ల అనిల్ రావిపుడి సినిమా ఇప్పట్లో ఉందదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు మూడవ హీరో దొరికినా వెంకీ, వరుణ్ లు ఖాళీగా లేరు.  వీరిద్దరు ఖాళీగా ఉండి, మూడో హీరో దొరికి ఎఫ్ ౩ ప్రేక్షకుల ముందుకు రావాలంటే 2022 సంక్రాంతి వచ్చేలా ఉందని నెటిజన్లు సిటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: