టాలీవుడ్ లో మెగా ప్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్ ప్రస్తుతం రాజకీయాల్లోనే కాదు వెండి వెరపై కూడా తన సత్తా చాటుతున్నారు.  త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా భారీ డిజాస్టర్ పొందింది.  ఈ మూవీ తర్వాత పవన్ రాజకీయాలపై ఫోకస్ చేశారు.  ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయారు.  అయితే మళ్లీ వెండి తెరకు ఆయన దగ్గరయ్యారు.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ మూవీ రిమేక్ చేస్తున్నారు.  ఈ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్నారు.  ఇలా వరుసగా సినిమాలు మొదలు పెట్టిన పవన్ కళ్యాన్ హీరోయిన్లు ఎవరు అన్న విషయంపై రోజుకో కథనాలు వస్తున్నాయి. 

 

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'పింక్' రీమేక్ లో చేస్తూనే, క్రిష్ దర్శకత్వంలోను సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మరో దర్శకుడు కూడా లైన్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.   పవన్ నటించబోయే చారిత్రక నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. అయితే కీర్తి సురేష్ తెలుగు లో హీరోలతో నటించే విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నాయి.  బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న ఓ మూవీల కీర్తి సురేషన్ ని సంప్రదించగా తనకు డేట్స్ సెట్ కావడం లేదని సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.   

 

కీర్తి సురేశ్ గతంలో పవన్ సరసన 'అజ్ఞాతవాసి' చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడం వలన, ఈ కాంబినేషన్ జనానికి ఎక్కలేదు. పవన్ రీ ఎంట్రీ వేళలో మళ్లీ కీర్తి సురేశ్ ను వెతుకుతూ అవకాశం వెళ్లడం ఆమె అదృష్టమే. మరి అజ్ఞాత వాసి లో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించిన కీర్తి కి ఆ మూవీ ఏమాత్రం కలిసి రాలేదు.  మరి పవన్ తో తీస్తున్న మరో సినిమా అయినా సెట్ అవుతుందా లేదా అన్న విషయం తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: