దర్శకుడు సుకుమార్ ‘రంగస్థలం’ మూవీ తరువాత సుమారు ఒక సంవత్సరం పాటు మహేష్ కు కథ చెప్పి అతడి అంగీకారం కూడ పొంది తన విలువైన కాలాన్ని వృథా చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత మహేష్ తన రూట్ మార్చి సుకుమార్ ను పక్కకు పెట్టి అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ వైపు వెళ్ళి పోవడంతో అసహనంతో రగిలిపోయిన సుకుమార్ అల్లు అర్జున్ ను ఆశ్రయించి రోజులలో తన మూవీ ప్రాజెక్ట్ ను ఓకె చేయించుకున్నాడు.


ఇప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి వంశీ పైడి పల్లి రిపీట్ చేయబోతున్నాడా అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ చేతిలో భంగపడ్డ సుకుమార్ రామ్ చరణ్ ను కలిసి ‘లూసిఫర్’ మూవీని రీమేక్ చేసే అవకాశం తనకు ఇవ్వవలసిందిగా కోరినట్లు టాక్. 


వాస్తవానికి ‘లూసిఫర్’ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ఇప్పటికే సుకుమార్ పూర్తి చేయడంతో ఆ మూవీని సుకుమార్ సూచించే ఒక దర్శకుడుతో తీయించాలని చరణ్ భావిస్తున్నాడు. వాస్తవానికి ఈ మూవీని చిరంజీవితో రీమేక్ చేయాలని భావించినా ఇప్పుడు ఆలోచనలు మారి చిరంజీవి స్థానంలో వెంకటేష్ తో ఈ మూవీని తీస్తే ఇలా ఉంటుంది అన్న ఆలోచనలు చర్చలలో ఉన్నట్లు తెలుస్తోంది. 


ఇప్పుడు వంశీ పైడి పల్లి రంగప్రవేశం చేసి తనకు అవకాశం ఇమ్మని చరణ్ ను కోరడంతో ప్రస్తుతం చరణ్ ఏమి చేయబోతున్నాడు అన్న సందేహాలు వెలువడుతున్నాయి. గతంలో బన్నీ సుకుమార్ ఆదుకున్నట్లుగా ఇప్పుడు చరణ్ వంశీ పైడి పల్లిని ఆదుకుంటే మహేష్ చేత తిరస్కరింప బడ్డ దర్శకులు అందరికీ అడ్డాగా మెగా కాంపౌండ్ మారిపోయే ఆస్కారం ఉంది. అయితే వంశీ పైడి పల్లి ప్రయత్నాలకు సుకుమార్ సహాయ సహకారాలు కూడ లభిస్తే వీరిద్దరూ కలిసి ఒకేసారి మహేష్ పై స్వీట్ రివెంజ్ తీర్చుకునే ఆస్కారం ఉంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: