సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస బ్లాక్ బస్టర్లతో మంచి జోష్ లో ఉన్నాడు. మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా మహేష్ తర్వాతి చిత్రం గురించి ప్రతిరోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తన తర్వాతి సినిమా వంశీతో ఉంటుందని ప్రకటించిన మహేష్ సడెన్ గా వంశీతో సినిమాని క్యాన్సిల్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. దాదాపు సంవత్సరంన్నర పాటు వంశీని వెయిట్ చేయించిన మహేష్ సడెన్ గా చేయనని చెప్పడంతో వంశీకి షాక్ తగిలింది.

 

 

దీంతో అప్పటి వరకు ఎంతో క్లోజ్ గా మెలిగిన వంశీ మహేష్ కి దూరం అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మహర్షి సినిమా టైమ్ నుండి ఇప్పటి వరకు మహేష్, వంశీల అసోసియేషన్ ని చూస్తూనే ఉన్నాం. వారిద్దరూ ఎంతో క్లోజ్ గా కనిపించారు. కానీ సడెన్ గా వీరిద్దరి మధ్య దూరం చాలా పెరిగిందని తెలుస్తుంది. అయితే వంశీ ఒక్కడే కాదు గతంలో చాలా మంది దర్శకులు మహేష్ కి దూరమయ్యారు.

 

 

మహేష్ కి దూరమైన వారిలో మొదటగా వినిపించే పేరు పూరి జగన్నాథ్. పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాక వీరిద్దరి కాంబినేషన్ లో బిజినెస్ మేన్ అనే సూపర్ డూపర్ హిట్ వచ్చింది. దాని తర్వాత జనగణమన స్క్రిప్ట్ తో పూరి మహేష్ వద్దకి వెళ్ళాడు. మహేష్ అది తనకి నచ్చక చాలా రోజులు వెయిట్ చేయించాడని టాక్. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ చాలా పెరిగింది. ఇక రెండో దర్శకుడు సుకుమార్. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ తో పనిచేయాలని అనుకున్నాడు.

 

 

దానికోసం సంవత్సరం పాటు వెయిట్ చేశాడు. కానీ తీరా మహేష్ నో అని చెప్పడంతో అదే కథతో అల్లు అర్జున్ తో ఫిక్స్ అయ్యి సినిమా కూడా స్టార్ట్ చేశాడు. పూరి జగన్నాథ్, సుకుమార్,  వంశీ లు మహేష్ బాబుకి దూరమయ్యారు. నెలల పాటు వెయిట్ చేయించి చివరాఖరికి నేను చేయను అంటే ఎవ్వరైనా దూరం అవుతారని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: