సాహో తర్వాత ప్రభాస్ జిల్ ఫేం రాఘాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఎవరితో చేస్తాడు అన్న దానిపై ఓ క్లారిటీ వచ్చింది. నాగ అశ్విన్ డైరక్షన్ లో వైజయంతి బ్యానర్ లో భారీ రేంజ్ లో సినిమా రాబోతుంది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి రెండు సినిమాలతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్.

 

ఇక ప్రభాస్ తో చేస్తున్న సినిమా ఎనౌన్స్ మెంట్ రాగానే సినిమా బడ్జెట్, కథ ఇదే అంటూ వార్తలు రాసేస్తున్నారు. నాగ్ అశ్విన్ కథ ప్రభాస్ కు బాగా నచ్చిందట. అయితే అది సైన్స్ ఫిక్షన్స్ స్టోరీ అని.. సినిమా బడ్జెట్ కూడా 200 కోట్ల దాకా ఉంటుందని ప్రచారం మొదలుపెట్టారు. అయితే అసలు బడ్జెట్ ఇంతా అని ఎక్కడ డిస్కస్ కూడా చేయలేదట చిత్రయూనిట్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే జరుగుతుందని తెలుస్తుంది.

 

స్టార్ సినిమా ఎనౌన్స్ మెంట్ రాగానే సినిమా గురించి రకరకాల న్యూస్ లు స్ప్రెడ్ చేస్తుంటారు. అలాంటివాటిలోనే ఈ న్యూస్ కూడా ఒకటి. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ 200 కోట్లతో సినిమా చేస్తాడత. అంతేకాదు ఇది పాన్ ఇండియ మూవీ కాదు అంతకుమించి అనిపించేలా చేస్తారట. మహానటి సావిత్రి బయోపిక్ ను చాలా అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో వెళ్లడిస్తారట. ప్రభాస్ తో సినిమా అంటే నాగ్ అశ్విన్ కచ్చితంగా అద్భుతం చేయడం గ్యారెంటీ అనేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: