పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. 

 

 

 


ఎన్టీఆర్ కథానయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత క్రిష్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే.  క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటుగా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమలో పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. మొన్నటి వరకు కంచె హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ని తీసుకుంటున్నారని అన్నారు. కానీ ఇప్పుడు సడెన్ గా మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది.

 

 

 

మహానటి ద్వారా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ని పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించాలని అడుగుతున్నారట. పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్ ల కాంబోలో అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. అందువల్ల క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు కీర్తి సురేష్ అయితే బాగుంటుందని చూస్తున్నారట. 

 

 

మరి వీరిద్దరి కాంబినేషన్ ఈ సారైనా సత్ఫలితాన్నిస్తుందా లేదా చూడాలి. పింక్ రీమేక్ షూటింగ్ పూర్తికాగానే క్రిష్ తో మూవీ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి విరూపాక్ష అనే టైటిల్ పరిశీలనలో ఉంది.  క్రిష్ తో మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సిమ్గ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: