తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో గా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా కాకుండా విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగా మారి రాణిస్తున్న వారిలో గోపీచంద్ ఒకరు. జయం సినిమాతో విలన్ గా  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు గోపీచంద్. ఇక ఆ తర్వాత విలన్ గా  చాలా సినిమాల్లో నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నిజం సినిమాలో  విలన్ గా  నటించి.. డిఫరెంట్ గెటప్ తో అదర గొట్టారు గోపీచంద్. ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ వర్షం సినిమాలో విలన్ గా  నటించి... ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు గోపీచంద్.

 

 

 ఇక ఎన్నో సినిమాల్లో నటించి యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు తన సినిమాలతో మరింత దగ్గర అయిపోయారు గోపీచంద్. ఇక ఇప్పటికీ మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వుంటారు. ఇదిలా ఉంటే గోపీచంద్ 2003 సంవత్సరం లోనే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గోపీచంద్ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గోపీచంద్ భార్య పేరు రేష్మ. గోపీచంద్ భార్య రేష్మ హీరో శ్రీకాంత్ కు మేనకోడలు వరస అవుతుంది. అయితే అప్పట్లో ఫోటో చూసి ఒకరికొకరు నచ్చి ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

 

 

 వీరిద్దరికీ మధ్యవర్తిగా సీనియర్ నటుడు చలపతిరావు ఉన్నారు. ఆయన వల్లే ఈ వివాహం జరిగింది. హీరో శ్రీకాంత్ కూడా గోపీచంద్ తనకంటే మంచివాడని పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటావు  అంటూ... తన మేనకోడలు  అయినా రేష్మా కు చెప్పడంతో రేష్మా గోపీచంద్ తో పెళ్లికి అంగీకరించిందట. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు గోపీచంద్.

మరింత సమాచారం తెలుసుకోండి: