హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మహేష్. ఫ్యామిలీతో కలిసి యుఎస్కి వెకేషన్ వెళ్లిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి చిత్రాన్ని పక్కన పెట్టి మైత్రీ మూవీ మేకర్స్కి ఓ భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కానుందట. ఇదిలా వుంటే చిరు నటిస్తున్న చిత్రానికి కూడా మహేష్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు వరుస కథనాలు వినిపిస్తున్న వేళ తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది.
మహేష్ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు ప్రతీసారి వినిపిస్తూనే వున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ నదియావాలా తను నిర్మించిన ఓ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో రణ్వీర్సింగ్ కూడా నటించనున్నాడట. ఇందులో మహేష్ని కూడా నటింపజేయాలని, ఇందుకోసం ఓ భారీ మొత్తాన్ని ఆఫర్ చేశాడని తెలిసింది. అయితే ఈ ఆఫర్ని మహేష్ అంగీకరిస్తాడా?.. బాలీవుడ్కు వెళ్లే ఆలోచన తనకు లేదని ఇంత కాలం చెబుతూ వచ్చిన మహేష్ సాజిద్ నదియావాలా ఇచ్చిన ఆఫర్ని ఓకే చేస్తాడా? ఇంత బిజీ షెడ్యూల్లో అది అయ్యే పనేనా? అని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.
అయితే ఇప్పటికే బాలీవుడ్ నుంచి ప్రభాస్కి ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి దానికి ఓకే అయ్యేలానే ప్రభాస్ స్పందించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే... మరి వీరిదరికంటే ముందు మహేష్ బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తే బావుంటదని చాలా మంది ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కానీ చివరికి మహేష్ ఏం చేస్తాడో ఏమో మరి.