టాలీవుడ్ స్టార్ నిర్మాత‌, బ‌డా ప్రొడ్యుస‌ర్ దిల్ రాజుకు ఆయ‌న ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతూ వ‌చ్చింది. దిల్ రాజు ఏం చేసినా సంచ‌ల‌న‌మే అయ్యింది. డిస్ట్రిబ్యూట‌ర్‌గా తిరుగులేని విజ‌యాలు సొంతం చేసుకున్న ఆయ‌న 2003లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స్థాపించి దిల్ సినిమా నిర్మించిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌కు తిరుగు లేకుండా పోయింది. ఇక కొద్ది రోజులుగా ఆయ‌న అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌లో ఉన్న‌ట్టు పుకార్లు వ‌స్తున్నాయి. ఆయ‌న భార్య అనిత చ‌నిపోవ‌డం ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా పెద్ద లోటు.



ఇదిలా ఉంటే దిల్ రాజు నిర్మాణ సంస్థ ఎస్వీసీ నుంచి ఆయన సోదరుడు లక్ష్మణ్ వైదొలిగినట్లు ఇటీవల పుకార్లు గుప్పుమంటోన్న విషయం తెలిసిందే. ఎస్వీసీని పెట్టినప్పటి నుంచి ల‌క్ష్మ‌ణ్ రాజుతోనే భాగ‌స్వామిగా ఉన్నారు. రాజు వ్య‌వ‌హారాల‌న్ని ఎక్కువుగా ఆయ‌నే చూసుకునేవారు. అయితే ఇప్పుడు ల‌క్ష్మ‌ణ్ రాజు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వేరు కాపురం పెట్టార‌ని అంటున్నారు. అక్క‌డితో ఆగ‌ని ఆయ‌న పెద్ద పెద్ద సినిమాలు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు రైట్స్ కూడా సొంతం చేసుకున్నార‌ట‌.



చిరంజీవి- కొరటాల మూవీ, పవన్ కల్యాణ్- క్రిష్ మూవీ నైజాం రైట్స్‌ లక్ష్మణ్ చేతికి వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ విషయంలో లక్ష్మణ్‌ టాలీవుడ్‌లోని కొందరు పెద్దలు సహాయం చేస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు అంటే స‌హ‌జంగా న‌చ్చ‌ని వాళ్లు చాలా మందే ఉంటారు. ఇక కీల‌క‌మైన డిస్ట్రిబ్యూష‌న్ విష‌యంలో ఆయ‌న ఏక‌చ‌క్రాధిప‌త్యం న‌చ్చ‌ని వాళ్లు ఇప్పుడు ల‌క్ష్మ‌ణ్‌కు ప్ర‌త్యేకంగానో లేదా ప‌రోక్షంగానో స‌పోర్ట్ చేసే వాళ్ల‌ట‌.



ఈ విషయం తెలిసి కూడా దిల్ రాజు మాత్రం కూల్‌గా ఉన్నారట. తన తమ్ముడితో పెద్ద కాంపిటేషన్‌ను ఉండదని ఆయన భావిస్తున్నారట. ఎందుకంటే ఇప్ప‌టికే నైజాం డిస్ట్రిబ్యూష‌న్‌లో రాజుకు తిరుగులేకుండా ఉంది. దీంతో ల‌క్ష్మ‌ణ్‌తో త‌న‌కు పెద్ద ఇబ్బంది ఉండ‌ద‌ని ఆయ‌న ధీమాతో ఉన్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: