అల వైకుంఠపురములో’ మూవీతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్.. ఇటీవలే ఎన్టీఆర్‌తో రెండో సినిమాను ప్రకటించారు. అజ్ఞాత‌వాసి సినిమాతో కెరీర్ ప‌రంగా తీవ్రంగా డిఫెన్స్‌లోకి వెళ్లిపోయిన త్రివిక్ర‌మ్ ఆ సినిమాతో పోయిన ప‌రువు అంతా అల వైకుంఠ‌పుర‌ముతో సినిమాతో నిల‌బెట్టుకున్నాడు. మ‌ధ్య‌లో ఎన్టీఆర్ తో తెర‌కెక్కించిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా సైతం ఆడినా ఆ సినిమాలో త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ కంటే ఎన్టీఆర్ యాక్టింగ్‌కే ఎక్కువ పేరు వ‌చ్చింది. దీంతో అల వైకుంఠ‌పుర‌ములో సినిమా హిట్ అయ్యాకే త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ పాత త్రివిక్ర‌మ్ అనిపించుకోవ‌డంతో పాటు తిరుగులేని విధంగా ఫామ్‌లోకి వ‌చ్చాడు.



ఇక అల వైకుంఠ‌పుర‌ములో సినిమా స‌క్సెస్ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోన్న త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ ప‌నుల్లో బిజీ బిజీ అయిపోయారు. అయితే త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ఫామ్‌లోకి వ‌చ్చినా ఆయ‌న్ను కొన్ని వివాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.  అ...ఆ సినిమా నుంచి కాపీ మరకలు ఆయనపై ఎక్కువవుతున్నా. ఇక తాజా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అల వైకుంఠ‌పుర‌ములో సినిమా విష‌యంలోనూ క‌థ నాదే అని ఓ రైట‌ర్ ఆరోప‌ణ‌ల‌కు దిగాడు.



ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ బ‌డా నిర్మాణ సంస్థ‌తో త్రివిక్ర‌మ్‌కు వైరం జ‌రుగుతోంద‌ట‌. టాలీవుడ్‌లో బడా నిర్మాతగా పేరొందిన మైత్రీ మూవీ మేకర్స్.. నిర్మాణ రంగంలోకి వచ్చిన కొత్తలోనే త్రివిక్రమ్‌కు కొంత అడ్వాన్స్ ఇచ్చి, ఓ సినిమాను అగ్రిమెంట్ చేయించుకుందట. అయితే త్రివిక్ర‌మ్ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ బ్యాన‌ర్‌కు సినిమా చేయ‌లేదు. మ‌నోడు ఎప్పుడూ త‌న హోం బ్యాన‌ర్ అయిన హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌లోనే సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నాడు.



ఇప్పుడు త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ హారిక బ్యాన‌ర్‌లోనే సినిమా చేస్తుండ‌డంతో మైత్రీ వాళ్లు గొడ‌వ‌కు దిగార‌ట‌. మ‌ధ్య‌లో హారిక వాళ్లు త్రివిక్ర‌మ్ అడ్వాన్స్ తిరిగి ఇప్పిస్తామ‌ని చెప్పినా అందుకే మైత్రీ సంస్థ వారు ఒప్పుకోలేదట. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ప్రకటన త‌ర్వాత మైత్రీ త్రివిక్ర‌మ్‌పై మ‌రింత ప్రెజ‌ర్ చేస్తోంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ వివాదం నిజ‌మైతే దీని నుంచి త్రివిక్ర‌మ్ ఎలా బ‌య‌ట ప‌డ‌తాడో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: