రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రాకెట్ స్పీడుతో జ‌రిగిపోతోంది. ఇందులో ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి `వ‌కీల్‌సాబ్‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో వుంది. ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు ప‌వ‌ర్‌స్టార్ ఓ పీరియ‌డ్‌ చిత్రాన్ని కూడా చేస్తున్నారు.

 

వ‌రుస ఫ్లాపుల‌తో కొంత వెన‌క‌బ‌డిన క్రిష్ ఈ సినిమాతో త‌నేంటో నిరూపించుకోవాల‌ని, త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు ఓ భారీ హిట్‌తో స‌మాధానం చెప్పాలన్న క‌సితో ఈ సినిమా చేస్తున్నాడు. ఏ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా చ‌క‌చ‌కా జ‌రిగిపోతోంది. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరున్న పండ‌గ‌ల సాయ‌న్న క‌థ‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నార‌ని, ప‌వ‌న్ ఇందులో బందిపోటుగా క‌నిపిస్తార‌ని ఇప్ప‌టికే ప‌లు వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చి సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి.

 

ఇదిలా వుంటే ఈ సినిమా కోసం ప‌వ‌న్‌కు జోడీగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, ప్ర‌గ్యాజైస్వాల్‌ల‌ని ఎంపిక చేశార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే పిరియ‌డ్ సినిమాకు కీర్తి సురేష్ అయితేనే బాగుంటుంద‌ని భావించిన క్రిష్ ఫైన‌ల్‌గా ప‌వ‌న్‌కు జోడీగా కీర్తిసురేష్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. ఇక ఇదిలా ఉంటే పవ‌న్ ఇప్ప‌టికే దాదాపు మూడు సినిమాల‌కు సంత‌కాలు చేశార‌ని స‌మాచారం. అందులో రెండు చిత్రాలు ఆల్రెడీ షూటింగ్ జ‌రుగుతుండ‌గా మ‌రో కొత్త ప్రాజెక్ట్‌కి కూడా ప‌వ‌న్ ఓకే చేప్పేశాడ‌ట‌. అది ఎవ‌రిదోకాదు పూరి చిత్రానికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. మ‌రి రెండేళ్ళ గ్యాప్ త‌ర్వాత ఒకేసారి ప‌వ‌న్ సినిమాల‌తో దున్నేస్తున్నాడ‌నే చెప్పాలి.  ఇక మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే పండ‌గ‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: