ఎన్ని చట్టాలు, ఎన్ని శిక్షలూ వచ్చినా ఇంకా పూర్వకాలంలాగా కొన్ని ఇళ్ళలో వరకట్నపు వేధింపులు మాత్రం పోవడం లేదు. అత్తమామలు, భర్త ఇలాంటి వేధింపులన్నీ ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు అలా ఎవ్వరూ ఉండడం లేదు అనుకుంటారు. కానీ ఇప్పటికీ ఎప్పటికీ అలానే ఉందంటూ వరకట్నంపు వేధింపులు ఎప్పటికప్పుడే వరకట్న వేధింపులు మాత్రం ఆగడం లేదన్నట్టుగా కొన్ని కథలు ఇంకా అలానే నిదర్శనలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి విశాఖ జిల్లా సబ్బవరం మండలం అమృతపురంలో బుధవారం కృష్ణవేణి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అమృతపురం గ్రామానికి చెందిన వడిశెల నాగరాజు, కోటపాడు మండలం గవరపాలెం గ్రామానికి చెందిన చెందిన కృష్ణవేణికి 12ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే అత్తమామల వేధింపులు తాళతేక బుధవారం తెల్లవారు జామున 3.45గంటల సమయంలో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తమామలకు ఫోన్ చేసిన నాగరాజు కృష్ణవేణికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో జాయిన్ చేశాడని, అయితే కొద్దిసేపటికి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న వారు విగతజీవిగా పడివున్న తమ కూతురిని చూసి అల్లాడిపోయారు.
అయితే అత్తమామలు మాత్రం అల్లుడి మీద రివర్స్లో కేసు పెట్టారు. తమ కూతురిని అదనపు కట్నం, బంగారం తీసుకురావాలంటూ కొంతకాలంగా అత్త కన్నమ్మ, మామ వెంకునాయుడు చిత్రహింసలు పెడుతున్నారని, భర్త కూడా అనుమానంతో వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. వారిపై సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ వరకట్నపు వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ఏ పని చేసే ముందైనా ఓసారి వెనకా ముందు ఆలోచింది అడుగువేయాలి. తొందర పాటు నిర్ణయాల వల్ల మనతో పాటు మనల్ని నమ్ముకున్నవారు అనేక మంది నష్టపోతారు.