యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాహుబలి లాంటి సెన్సేషన్ హిట్ తర్వాత... సాహో లాంటి యాక్షన్  మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయాయి. కానీ విడుదలైన తర్వాత మాత్రం... ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సాహో సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే కథలో రెండు మూడు సార్లు మార్పులు కూడా చేశారు. మొదట ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత... సమంత శర్వానంద్ జంటగా నటించిన సినిమాకు జాను అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో ఈ సినిమా టైటిల్ ను రాధ శ్యామ్, లేదా ఓ డియర్  అనే టైటిల్ ను  పరిశీలిస్తున్నారు చిత్ర బృందం.

 


 ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్లో వేసిన పలు సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్నది మాత్రం ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఇక అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల ఈ ఏడాదిలోనే జరుగుతుందా లేకపోతే 2021లో జరుగుతుందనే దానిపై మాత్రం సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అయితే తాజాగా ప్రభాస్ సినిమా గురించి సన్నిహిత వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం... ప్రభాస్ సినిమా ఈ సంవత్సరమే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దసరా హాలిడేస్ ఈ సమయంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు... ప్లాన్ చేస్తుందట చిత్రబృందం. 

 


 అంటే అక్టోబర్ 16వ తేదీన ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. దసరా సెలవుల నేపథ్యంలో ఈ సినిమాకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉందని భావించిన చిత్రబృందం ఆ సమయంలో విడుదల చేయాలని భావిస్తున్నారట. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అక్టోబర్ లో  విడుదల చేయాలని భావించిన చిత్రబృందం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుపుతుందట.  ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాను తొందరగా పూర్తి చేసి నాగ్ అశ్విన్ తో సినిమా కోసం సిద్ధమవ్వాలి అనుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: