మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్ చేసినా.. ఫలానా దర్శకుడితో సినిమా అని వార్తలు వచ్చినా ఓ క్యూరియాసిటీ వస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. ఈ ప్రాజెక్ట్ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాకు దర్శకులుగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లో మాస్ డైరక్టర్ వివి వినాయక్ పేరు చేరిం. చిరంజీవి 153వ సినిమాకు సంబంధించి చిరంజీవి నుంచి వినాయక్ కు పిలుపు వెళ్లిందనే వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది.

 

 

ఈ జనరేషన్ లో చిరంజీవికి బాగా కలిసొచ్చిన దర్శకుడు ఎవరంటే వచ్చే పేరు వివి వినాయక్. 2003లో వచ్చిన ఠాగూర్ తో సంచలనం సృష్టించాడు. ఇంద్ర మానియాను కంటిన్యూ చేస్తూ వెంటనే అంతటి హిట్ ఇచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా చెప్పుకునే ఖైదీ నెం.150ని కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ చేశాడు. చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు. సొంత కథల కంటే ఇతరుల కథలని తెరకెక్కిస్తాడన్న పేరు ఉంది. కానీ ప్రస్తుతం వినాయక్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎవరూ పిలిచి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో వినాయక్ ను చిరంజీవి నమ్మడం కరెక్టేనా అంటున్నారు.

 

 

వీరి కాంబోలో కొత్త కథ తెరకెక్కుంతుందా.. లేదంటే మళయాళ రీమేక్ లూసిఫర్ ను తెరకెక్కిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి గాసిప్ లాంటి ఈ వార్తపై అఫిషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం.. అసలు వినాయక్ ఎక్కడున్నాడో కూడా తెలీని పరిస్థితి. తను హీరోగా దిల్ రాజు మొదలుపెట్టిన సినిమా శీనయ్య కూడా ఆగిపోయింది. ఔట్ డేటెడ్ దర్శకుడిగా మారిన వినాయక్ పేరుతో అసలు పరిశ్రమలో చర్చే జరగకపోవడం విడ్డూరమనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: