తెలుగు ఇండస్ట్రీలో మస్ మహరాజ గా పేరు తెచ్చుకున్న రవితేజ ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత వరుసగా నాలుగు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.  ఇటీవల ఎన్నో ఆశలు పెట్టుకొని డిస్కోరాజా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  కానీ ఈ చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో పీకల్లోతుల్లో కష్టాల్లో పడ్డారు.  మాస్ ఎలిమెంట్స్ తో ఆయన కథలు ఎంచుకుంటారని తెలిసిందే. అయితే ఈ మద్య ఏ చిత్రంతో వచ్చినా ప్రేక్షకులు మాత్రం ఆదరించలేకపోతున్నారు.  దాంతో తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలో ‘క్రాక్’ చిత్రంలో నటిస్తున్నాడు.  బలుపు లాంటి బిగ్గెస్ట్ హిట్ తెరకెక్కించిన గోపిచంద్ మలినేనితో ‘కాక్ర్’ చిత్రంలో నటిస్తున్నాడు.  ఇలీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.

 

సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఆ మద్య  ‘వెంకీ మామ’ చిత్రంతో  సందడి సందడి చేసిన వెంకటేష్  ‘సినిమా చూపిస్త మామ’ ఫేమ్‌ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ఆ స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కి నచ్చలేదట. కథలో మార్పులు చేర్పులు చేసినా సురేష్ బాబు ని మాత్రం మెప్పించలేక పోయారట. ఇక ఆ ప్రాజెక్టు  అక్కడ వ‌ర్క‌వుట్ కాదని అర్దం చేసుకుని... ఆ క‌థ ప‌ట్టుకుని చాలా మంది ద‌గ్గ‌ర‌కు తిరిరాగరట.. చివరికి ఆ కథ మాస్ మహరాజకు నచ్చడం ఒకే చెప్పేయడం కూడా జరిగిపోయిందట.

 

ఈ  చిత్రం ఏప్రియల్ లో సెట్స్‌ మీదకు తీసుకెళ్తారని సమాచారం. నాన్‌స్టాప్‌ సింగిల్‌ షెడ్యూల్‌లోఈ చిత్రం పూర్తి చేసే యోచనలో ఉన్నారట. ఈ దర్శకుడు చివరగా రామ్ హీరోగా 'హలో గురు ప్రేమకోసమే' అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఆతరువాత మరో సినిమా కమిట్ అవ్వలేదు త్రినాద్.  గతంలో త్రినాథ్ సినిమా చూపిస్త మావా, నేను లోక‌ల్, హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రాలు తెరకెక్కించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: