పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఘోర పరభావం ఎదురు కావటంతో సినిమాల మీద దృష్టి పెట్టాడు పవన్‌. ఇప్పటికే బాలీవుడ్‌ సూపర్‌ హిట్ మూవీ పింక్‌ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకు పూర్తయ్యింది. పవన్‌ లాయర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వకీల్ సాబ్‌, లాయర్‌ సాబ్‌ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు.

 

సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పవన్‌ బందిపోటు దొంగగా కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు విరూపాక్షి అనే టైటిల్‌ను పరిశీలస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాను పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

 

ఈ సినిమాలో పవన్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తో పాటు సౌత్‌ బ్యూటీ కీర్తి సురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  పాన్‌ ఇండియా సినిమా కావటంతో కీలక పాత్రల్లో జాతీయ స్థాయి నటులను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలో పవన్‌కు ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ రామ్‌ పాల్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. 

IHG


బాలీవుడ్‌లో ఫ్యామిలీ వాలా, డాన్2, ఓం శాంతి ఓం చిత్రాల్లో నటించాడు అర్జున్ రాంపాల్. పవన్‌ సినిమాలో విలన్‌ పాత్రకు కూడా హీరో స్థాయి ఇంపార్టెన్స్‌ ఉండటంతో అర్జున్‌ అయితే కరెక్ట్‌ అని భావిస్తున్నారట చిత్రయూనిట్. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా అర్జున్‌ ను తీసుకోవటం దాదాపు కన్‌ఫార్మ్ అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: