మహానటి సినిమా లో అలనాటి సావిత్రి కి పోటీ ఇచ్చేలా కీర్తి సురేష్ నటించి తెలుగు ప్రేక్షకులలో గొప్ప స్థానాన్ని సంపాదించింది. ఈ ఒక్క సినిమా లోనే తన హావభావాలు, బొద్దుగా ఉన్న అందచందాలు అందర్నీ కట్టి పడేశాయి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే మహానటి సినిమా తర్వాత ఆమెకు చేసిన సినిమాలు పెద్దగా హిట్టు కాలేదు. దీంతో నిరాశ చెందిన కీర్తి సురేష్ బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది కానీ అక్కడ కూడా తన సినిమాలు విజయం సాధించలేకపోయాయి. సో, ఆమె మళ్లీ తెలుగు, తమిళ సినిమాలు చేసేందుకు ఒప్పుకొని ప్రస్తుతం బిజీగా ఉంది. అయితే మహానటి లో కొంచెం బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్... లావు తగ్గి సన్నగా అవ్వాలనుకుంది.



తాను ఆశించినట్లుగానే ఎంతో కష్టపడి సన్నగా అయ్యింది కానీ ఇంతకుముందు తనలో ఉన్న ఫేస్ గ్లో, గ్లామర్ పూర్తిగా మాయమై పోయింది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న తన ఘోరమైన ఫోటోలను చూసి నెటిజనులు నిరాశ చెందుతున్నారు. చాలా మంది ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ మాకు ఓల్డ్ కీర్తి సురేష్ నే కావాలి అని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా పాలిపోయిన, అస్సలు ఆకర్షణీయంగా లేని ఆమెను రాబోయే సినిమాలలో ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అన్న క్యూస్షన్ మార్క్ అందరిలో తలెత్తక మానదు.



తన సినీ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే... కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి', 'మిస్ ఇండియా', నితిన్ హీరోగా నటించనున్న 'రంగ్ దే', ఇంకా రజినీకాంత్ నెక్స్ట్ సినిమాలో నటించేందుకు అంగీకరించింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలో హీరోయిన్ గా నటించాలని కోరుతూ ఆ చిత్ర బృందం కీర్తిని సంప్రదించినట్లు సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి లో కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే. ఒకవేళ కీర్తి సురేష్ ఓకే చెబితే ఇది పవన్ కళ్యాణ్ తో తన రెండవ సినిమా అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: