సాహో స్టార్ ప్రభాస్ స్టన్నింగ్ కాంబినేషన్ ని సెట్ చేశాడు. ఎక్స్ పెక్ట్ చేయని క్రేజీ డైరెక్టర్ తో డార్లింగ్ తర్వాతి మూవీ చేయబోతున్నాడు. మహానటితో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న నాగఅశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

 

ప్రభాస్ సినిమా సినిమాకు లాంగ్ టైమ్ పీరియడ్ తీసుకుంటున్నాడు. పోనీ క్రేజీ స్టార్ డైరెక్టర్స్ తో సినిమా చేస్తున్నాడా అంటే అదీ లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్, సుజిత్, రాధాకృష్ణ లాంటి అప్ కమింగ్ డైరెక్టర్స్ తో సినిమా చేశాడు. దీంతో ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ నెర్వల్ గా ఫీలవుతున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్నాడో ఏమో గానీ ప్రభాస్.. నాగ అశ్విన్ లాంటి క్రేజీ డైరెక్టర్ తో అదిరిపోయే సినిమా ఎనౌన్స్ చేశాడు. 

 

ప్రభాస్ తన తర్వాతి సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ ఇండియా వైడ్ గా ఫేం అయ్యాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డ్ కూడా దక్కడంతో దర్శకుడిగా నాగ అశ్విన్ పేరు మారుమోగింది. దీంతో ఈ దర్శకుడు తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తాడా అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో నాగ్ అశ్విన్, ప్రభాస్ తో సినిమా చేస్తుండటం స్కై రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాడు. 

 

మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ చిరంజీవి కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్టు వినిపించింది. కానీ ఫైనల్ గా ప్రభాస్ తో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో ప్రభాస్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కంప్లీట్ కాగానే నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ పైకి వెళుతోందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: