స్టార్స్ కు హిట్స్ ఇచ్చి ఓ వెలుగు వెలిగిన దర్శకుడు.. ప్రస్తుతం డౌన్ ఫాల్లో ఉన్నాడు. ఎవరితో ఏ సినిమా తీసినా ఫ్లాపే. హిట్ కోసం ఏడేళ్లుగా వెయిట్ చేస్తున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్.. చిరంజీవి.. మహేశ్ కు కథలు వినిపించాడట. 

 

ఏడేళ్ల క్రితం రాజమౌళి తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరిది అంటే.. అందులో శీనువైట్ల పేరు ఉండేది. కష్టాల్లో ఉన్న మహేశ్ కు దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఈ కృతజ్ఞతతోనే.. సూపర్ స్టార్ శ్రీనువైట్లకు మరో ఛాన్స్ ఇచ్చి ఆగడు మూవీ చేశాడు. 

 

దూకుడు రిలీజ్ కాకుండానే ఎన్టీఆర్ శీనువైట్లతో బాద్షా మూవీకి కమిట్ అయ్యాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆగడు.. బ్రూస్ లీ.. మాస్టర్.. అమర్ అక్బర్ ఆంటోని నిరాశపరిచాయి. లాస్ట్ రెండు సినిమాలతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. ఈ డిజాస్టర్స్ తర్వాత శ్రీనువైట్ల పేరు మళ్లీ వినిపించలేదు. 

 

శ్రీను వైట్ల కనిపించి ఏడాది దాటింది. లాస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ 2018 నవంబర్ లో రిలీజ్ కాగా.. ఇంతవరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు. ఆ మధ్య తనదైన స్టైల్లో ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటూనే.. కొత్త కథతో వస్తానని చెప్పాడు. మరి మనసు మార్చుకున్నాడో ఏమోగానీ ఇంతలోనే పెద్ద హీరోలకు కథలు రాసుకున్నాడు. పోయిన స్టార్డమ్ మళ్లీ దక్కాలంటే.. పెద్ద హీరోలే కరెక్ట్ అన్న ఫీలింగ్ తో ఈ కామెడీ డైరెక్టర్ ఉన్నాడనుకుంట. రీసెంట్ గా చిరంజీవి, మహేశ్ కు కథలు వినిపించాడన్న ప్రచారం జరుగుతోంది.  

 

దూకుడు లాంటి బ్లాక్ బ్లస్టర్ ఇచ్చాడన్న ఆనందంలో మహేశ్ శ్రీనువైట్లతో ఆగడు చేశాడు. ఈ ఫ్లాప్ తర్వాత కోలుకొని.. ఈ మధ్యనే హ్యాట్రిక్ హిట్ కొట్టిన మహేశ్ శ్రీనువైట్లకు మరో అవకాశం ఇస్తాడా.. చిరంజీవితో తీసిన అందరివాడు అంటూ నిరాశపరిచినా.. ఇందులో కామెడీ చాలా మందికి నచ్చింది. కొరటాల.. త్రివిక్రమ్ అంటూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ వైపు చూస్తున్న చిరంజీవి.. శ్రీనువైట్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.. ఇలా డౌట్స్ ఎన్ని ఉన్నా.. కథతో మెప్పిస్తే.. ఛాన్స్ దక్కవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: