ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఆంధ్రా ప్రాంత వీరుడు అల్లూరి సీతారామ రాజు, తెలంగాణా ప్రాంతానికి చెందిన వీరుడు కొమరం భీమ్ లు కలిస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రాజమౌళి రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సిద్దమయ్యారు. 

 

ఇక టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా బట్ నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ ప్రముఖ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఇక వీళ్ళ పాత్రలకు సంబంధించి షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి అయినట్టే తెలుస్తుంది. వచ్చే నెల లో హీరోల లుక్స్ ని ఉగాది కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్ ని కచ్చితంగా వచ్చే నెల విడుదల చేస్తారనే టాక్ ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో కొమరం భీమ్ మరణించే అవకాశం ఉందని అంటున్నారు. నైజాం వాళ్ళు దాడి చేస్తారని, ఒక కోట లో ఉన్న ఎన్టీఆర్ ప్రాణాలు కోల్పోతాడని, అప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుందని అంటున్నారు. ఇక రామ్ చరణ్ అప్పుడు ఎన్టీఆర్ ని కాపాడటానికి వచ్చినా పెద్దగా ఫలితం ఉండదని, సైన్యం నుంచి మద్దతు లేక ప్రాణాలు కోల్పోతాడు ఎన్టీఆర్... అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాలో శ్రేయా, అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: