టాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. బాహుబలి సీరీస్ ప్రభాస్ కి ఒక రేంజ్ గుర్తింపు తెచ్చిపెట్టింది అనేది అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమా ద్వారా హాలీవుడ్ వాళ్ళు కూడా ప్రభాస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసారు. ఇక ఆ సినిమాతో ప్రభాస్ పూర్తిగా కమర్షియల్ హీరోగా మారిపోయాడు అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ప్రభాస్ అక్కడి నుంచి ఏది ఆలోచించినా సరే కమర్షియల్ గానే ఆలోచిస్తున్నాడని అంటున్నారు.

 

సినిమా తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేసాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా సరే వసూళ్లు భారీగానే వచ్చాయి. ఇక ఆ సినిమా ద్వారా ప్రభాస్... తన రేంజ్ ఏంటో బాహుబలి తర్వాత స్పష్టంగా చెప్పేసాడు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ అంటే చాలు నిర్మాతలు భయపడుతున్నారట. దానికి కారణం ఏంటీ అంటే... ప్రభాస్ రేంజ్ ఖర్చు పరంగా కూడా భారీగా పెరిగిపోయింది. రోజు వారి ఖర్చు కూడా ఎక్కువైనట్టు సమాచారం. దాదాపు అతను షూటింగ్ ఉన్న రోజు లక్షకు పైగా ఖర్చు అవుతుంది అంటున్నారు. 

 

ప్రభాస్ కి అందించే వాటర్ నుంచి ప్రతీ ఒక్కటి ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. ఇక అతనికి సహాయకులతో పాటు... విదేశాల్లో షూటింగ్ ఉంటే మరింత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. ఆయనతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళ ఖర్చు కూడా పెరుగుతుంది. ఇలా ఏ విధంగా చూసినా సరే ప్రభాస్ కి సినిమాతో పారితోషికం పాటుగా ఇవి మరో రెండు మూడు కోట్లు వరకు ఖర్చు అవుతూనే ఉంది. దీనితో ఇప్పుడు చాలా మంది ప్రభాస్ తో సినిమా అనగానే అన్ని రకాలుగాను ఆలోచించుకునే ఓకే చెప్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: