బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఆయన సినిమాలు అనగానే అభిమానుల్లో ఒకరకమైన క్రేజ్ ఉంటుంది. వరుసగా దర్శకులు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ పట్టింది ప్రతీది బంగారమే అవుతుంది అనే మాట అక్షరాలా నిజం. ఆయనతో సినిమా అనగానే భారీగా వసూళ్లు కూడా ఉండటంతో దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. సాహో సినిమా ఫ్లాప్ అయినా సరే దేశ వ్యాప్తంగా భారీగా వసూళ్లు రాబట్టింది.
ఆ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో తన కెరీర్ లో 20వ సినిమాలో నటిస్తున్నాడు. పీరియాడికల్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈ చిత్రం లో ఈ మధ్య విజయవంతమైన హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఈ ఆ రెండు సినిమాలకు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీల్లో విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది.
అయితే ఇప్పుడు మాత్రం మారింది అంటున్నారు. ఇంకా త్వరగానే ప్రేక్షకుల ముందుకి సినిమాను తీసుకురావాలని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం చూస్తే ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 16న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఏంటీ అనేది స్పష్టత రాలేదు. మూడు టైటిల్స్ ని ఈ సినిమా కోసం పరిశీలిస్తుంది చిత్ర యూనిట్. జాన్ సహా మరో రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మరి ఏ టైటిల్ ని ఖరారు చేస్తారు అనేది చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేస్తాడు అనేది చూడాలి.