టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన పింక్ మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తుండగా, యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. 

 

మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి సినిమాలో ఎంతో కీలకమైన కోర్ట్ సన్నివేశాలని ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది సినిమా యూనిట్. ఇక ఈ సీన్స్ షూటింగ్ లో భాగంగా ఒక ముఖ్యమైన కేసు విషయమై న్యాయం వైపు హీరో పవన్ వాదిస్తుంటే, మరోవైపు నేరస్థులను రక్షించే లాయర్ గా ప్రకాష్ రాజ్ వాదిస్తున్నారని, ఇక ఈ సీన్ రేపు థియేటర్ లో ఎంతో అదిరిపోతుందని అంటున్నారు. 

 

ముఖ్యంగా అటు పవన్, ఇటు ప్రకాష్ రాజ్ ఇద్దరూ కూడా ఒకరిని మించేలా మరొకరు ఢీ అంటే ఢీ అనేలా ఈ సీన్ లో నటిస్తున్నారని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి అనంతరం రెండేళ్ల గ్యాప్ తీసుకుని పవన్ నటిస్తున్న సినిమా కావడంతో, దీనిపై మెగాఫ్యాన్స్ లో ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా ఈ సినిమా టైటిల్ తో పాటు మొదటి సాంగ్ ని అతి త్వరలో రిలీజ్ చేయనుందట సినిమా యూనిట్. మరి రెండేళ్ల గ్యాప్ తరువాత మేకప్ వేసుకున్న పవన్, ఈ సినిమాతో ఎంత మేర సక్సెస్ ని అందుకుంటారో తెలియాలంటే మాత్రం మరొక రెండు నెలలు వెయిట్ చేయాల్సిందే......!! 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: