సినిమా ఇండస్ట్రీలో ఇగో ఎక్కువన్న సంగతి తెలిసిందే. అది ఎవరి మధ్య ఎప్పుడైనా కలగవచ్చు. ఈ రోజు కలిసి పని చేసిన ఇద్దరు వ్యక్తులు .. వాళ్ళు ఆడ మగ అయినా ఇద్దరు మగవాళ్ళైనా ..ఎవరైనా సరే వాళ్ళలో ఒకరు ఫేమస్ అయి ఇంకోకరు కాస్త బ్యాడ్ పొజిషన్ లో ఉంటే వాళ్ళు మరీ తెలియని వాళ్ళలా అసలెప్పుడు ఈ వ్యక్తిని చూడలేదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్భాలలో అది మనసుకొ బాగా బాధ కలిగిస్తుంది కూడా. ఈ విషయాన్ని అందరికంటే స్పష్టంగా టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ తేజ నిర్మొహమాటంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తను పరిచయం చేసిన చాలా మంది నటీ నటులకి కృతజ్ఞత లేదని ఇండస్ట్రీలో చాలామంది థాంక్ లెస్ పీపుల్ అని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి సంచలన వ్యాఖ్యలు మరొకరు చేస్తున్నారు.

 

అతనే టాలీవుడ్ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్. ఇప్పుడు ఆయన వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కంటే డేంజర్ గా తయారయ్యాడు. ఈ మాస్టర్ నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆయన నోరు తెరిచాడంటే ఇప్పుడు ఎవరి బండారాలు బయటపడతాయో అంటూ అందరు హడలి చస్తున్నారు. రాకేష్ మాస్టర్ ఇంతకముందు శేఖర్ మాస్టర్ తన శిష్యుడు అని కానీ అతనికి పొగరు తలకెక్కిందని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మరికొంత మందిపై రాకేష్ స్వయంగా సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాజాగా రాకేష్ మాస్టర్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రస్తుతం నిర్మతాగా ఉన్న వ్యక్తిపై సంచలన నిజాలను బయట పెట్టాడు. ప్రస్తుతం హీరోయిన్ సినిమాలు మానేసి పూరి జగన్నాధ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అంటూ సినిమాలు నిర్మిస్తున్న హీరోయిన్ ఛార్మి గురించి రాకేష్ మాస్టర్ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

 

ఒక సినిమా ఈవెంట్ లో మనకి పరిచయమున్న అమ్మాయే కదా అని ఛార్మి తన పక్కనుండి వెళుతుంటే.. తనని పలకరించి ఎలా ఉన్నావమ్మా అని పలకించాను. కాని తను నన్ను పైకి కిందకి చూసి 'ఎవరు నువ్వు' ..? అన్నట్టుగా చూసి వెళ్ళిపోయింది అని తెలిపారు. ఛార్మి కృష్ణవంశీతో చక్రం సినిమా చేసినప్పటి నుంచే తెలుసనీ.. అప్పట్లో ఛార్మి తన దగ్గర డాన్స్ నేర్చుకుంది అని రాకేష్ మాస్టర్ చెప్పారు. కానీ ప్రభాస్ మాత్రం నన్ను పలకరించి ఎలా ఉన్నారని అడిగాడని చక్రం సినిమాకి ప్రభాస్ తో నేను వర్క్ చెయ్యడంతో ప్రభాస్ నన్ను గుర్తుపట్టాడని తెలిపాడు. అయితే ఛార్మి ప్రవర్తన నన్ను బాగా హర్ట్ చేసిందని బాధ పడ్డారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: