టాలీవుడ్ లో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.  మాటల రచయితగా ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన తర్వాత దర్శకుడిగా మారారు.  మెగా ఫ్యామిలీ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీశారు.  మహేష్ బాబు తో బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించారు.  టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆయన సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు.  ఈ ఏడాది అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  అయితే త్రివిక్రమ్ ఎక్కువగా హారిక అండ్ హాసిని సంస్థ  తో సినిమాలు తీస్తారన్న విషయం తెలిసిందే.

 

ఈ మద్య మైత్రి మూవీ మేకర్స్ మధ్య ఓ వివాదం చాలా రోజులుగా కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీమంతుడు, జనత  గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించారు.  గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మైత్రి మూవీ మేకర్స్ తో ఓ మూవీ తీసేందుకు కమిట్ అయ్యారట.  అంతే కాదు అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. కానీ ఆయన ఎక్కువగా కానీ త్రివిక్రమ్ కు హారిక అండ్ హాసిని సంస్థ  తోనే ఎక్కువ సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.  అయితే గతంలతో తీసుకున్న తమ అడ్వాన్స్ ని నష్టపరిహారంతో కలసి మూడు రెట్లు తిరిగి చెల్లించాలని మైత్రి డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దాంతో ఇప్పుడు త్రివిక్రమ్ కి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిలో ఉన్నారు. 

 

అడ్వాన్స్ తిరిగి ఇచ్చేందుకు ఆయన రెడీగా ఉన్నా ఏకంగా మూడు రెట్టు అంటే చాలా భారం అవుతుందని అంటున్నారు.  ఆయన తీసే సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో.. డబ్బు విషయంలో అంత కేర్ ఉంటారని ఫిలిమ్ వర్గాల్లో టాక్.  అయితే త్రివిక్రమ్ విషయంలో మైత్రి డిమాండ్ ఎక్కడా తగ్గడం లేదట.  ఈ వివాదాన్ని సెటిల్ చేయడానికి హారిక అండ్ హాసిని రాధాకృష్ణ మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది.  కానీ మైత్రీ మూవీస్ మాత్రం ససేమిరా అంటున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: