సౌత్ ఇండియాలో తమిళ స్టార్ బ్యూటీ నయనతార కు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సమానమైన క్రేజ్ వుంది. పెద్ద స్టార్ హీరోయిన్ గా ఇప్పటికే పేరు పొందిన అమ్మడు ఇండస్ట్రీలో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా గత మూడేళ్లలో నయనతార ఎంత బిజీ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి తమ సినిమాల్లో నటింపజేసుకుంటారు అక్కడి నిర్మాతలు.

 

ఇటీవల వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారడంతో ఆమె సినిమాలు చేస్తున్న స్పీడ్ కొద్దిగా తగ్గిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆమె మెయిన్ లీడ్ గా నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ లు గా నిలిచి ఆమెకు అగ్ర స్థానాన్ని కట్టబెట్టాయి. అయితే ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

 

అయితే రజనీకాంత్ దర్బార్ చిత్రంలో అమ్మడు 5 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి రజనీకాంత్ సరసన నటించేందుకు నయనతార పది కోట్లకు పైగా డిమాండ్ చేసిందని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దీంతో నయనతార రేంజ్ వేరే లెవల్ కు వెళ్లి పోతుంది అని అందరూ అనుకుంటూ ఉండగా.. ఇదంతా కేవలం పుకార్లే అని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వెల్లడించింది.

 

ప్రస్తుతం సినిమాలు కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఉన్న ప్రాజెక్టులు కూడా పోగొట్టుకోకుండా గత చిత్రాలతో పోలిస్తే 20 శాతం తక్కువ తీసుకుంటోందన్న విషయం బయటకు వచ్చింది. అయితే తాను రెమ్యూనరేషన్ తగ్గించింది అన్న విషయం అందరికీ తెలిసినా కూడా కొత్త ప్రాజెక్టులు ఏమి ఇంకా ఆమె చేతికి రాలేదు. కానీ నయనతార క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెకు కొద్దిరోజుల్లోనే ఎన్నో సినిమాలు వచ్చి ఒళ్ళు పడే అవకాశం లేకపోలేదు. ఎంతైనా నయన్ స్థాయే వేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: