తెలుగు సినిమా పరిశ్రమకి అక్కినేని నాగచైతన్య హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుందా, అలానే ఆపై బాలీవుడ్లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన మొహంజదారో వంటి సినిమాల్లో నటించినప్పటికీ కూడా పూజ హెగ్డే కు సరైన సక్సెస్ మాత్రం లభించలేదు. ఆపై ఆమె బన్నీ హీరోగా తెరకెక్కిన డీజే ద్వారా కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రం అందుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత సినిమాలో హీరోయిన్ గా నటించింది పూజ. 

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి హిట్ సాధించి పూజా హెగ్డే కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ నిచ్చింది. ఇక ఆపై మహేష్ తో ఆమె నటించిన మహర్షి, అలానే వరుణ్ తేజ్ తో కలిసి నటించిన గద్దలకొండ గణేష్, ఇక ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన అలవైకుంఠపురము లో సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ సాధించాయి. దానితో ప్రస్తుతం వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా దూసుకెళుతున్న పూజా, ఎప్పటికప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా మాద్యమాల ద్వారా తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా ఇటీవల తన ముద్దుల పెంపుడు కుక్క తో కలిసి దిగిన ఒక ఫోటోని ఒకానొకరోజు పొద్దున్నే పోస్ట్ చేసిన పూజా, ఒక్కసారిగా తన ఫ్యాన్స్ అందరికీ కొంత షాక్ ఇచ్చింది. 

 

ఇక ఆ పోస్టులో తన ముద్దుల పెట్ తో కలిసి దిగిన ఫోటోలో, నేను తనతో లవ్ ఎఫైర్ లో ఉన్నాను, దయచేసి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అంటూ సరదాగా ఆ ఫోటో ను ఉద్దేశించి పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ పోస్ట్ చూసిన ఆమె ఫ్యాన్స్, మొదట కొంచెం షాక్ అయినప్పటికీ, ఆ తర్వాత ఆమె మాటల వెనుక ఉన్న ఆంతర్యం గ్రహించి పూజా ఫన్నీ పోస్ట్ పై వారు కూడా కొంత సరదాగా కామెంట్స్ చేయటం మొదలెట్టారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: