నభా నటేష్ అంటే అందరికీ ఇస్మార్ట్ శంకర్ సినిమానే గుర్తొస్తుంది. ఆ సినిమాలో గ్లామర్ తో జనాలకి పెంచేసిన హీట్ అంతా ఇంతా కాదు. అయితే నభా ఈ సినిమా కంటే ముందు నన్ను దోచుకుందువటే సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ బాబు ఈ సినిమాలో హీరోగా నటించాడు. సినిమాకి మంచి పేరే వచ్చింది. అంతేకాదు నభా నటేష్ కి హీరోయిన్ గా మంచి మార్కులు పడ్డాయి. టాలీవుడ్ కి మరో హాట్ గాళ్ దొరికిందని అనుకున్నారు. కాని కమర్షియల్ గా పెద్ద సక్సస్ అవలేదు నన్ను దోచుకుందువటే సినిమా. మన దగ్గర సినిమా కమర్షియల్ సక్సస్ అయితే హీరోయిన్ కి వరుసగా ఛాన్సులు వస్తాయి.

 

అదే నభా కి మైనస్ అయింది. అయితే ఆ మైనస్ ప్లస్ గా మార్చుకునే అద్భుతమైన అవకాశం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కల్పించారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి అన్నిటిని మర్చిపోయి రాం పోతినేని తో ఇస్మార్ట్ శంకర్ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాలో అనూహ్యంగా అవకాశం దక్కించుకుంది నభా నటేష్. ఫస్ట్ హీరోయిన్ గా రాం సరసన నభా బాగా రొమాన్స్ చేసింది. అది మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. ముఖ్యంగా పూరి స్టైల్ హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటిగా బాగా పేరొచ్చింది.

 

అదే జోష్ లో నభా నటేష్ కి మాస్ మహారాజా రవితేజ సినిమాలో వెంటనే ఛాన్స్ వచ్చింది. అదే డిస్కో రాజా. ఈ సినిమా కాన్సెప్ట్ గొప్పగా ఉంటుందని మాస్ రాజాకి హిట్ పక్కా అని అందరూ అనుకున్నారు. అందరిలాగానే నభా కూడా మాస్ మహారాజా సినిమా డిస్కో రాజా సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుందామని రవితేజ హిట్ ఇచ్చి తన కి డబుల్ ఎనర్జీనిస్తాడని భావించింది. కానీ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దాంతో నభా బాగా డిసప్పాయింట్ అయింది. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన క్రేజ్ డిస్కోరాజా తో పోయింది. ఈ దెబ్బకి నభా నటేష్ రవితేజ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటే నన్ను మోసం చేశాడు ..పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు ఆయన మోసపోయాడు కదా అంటూ ఫీలవుతుందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: