అజ్ఞాతవాసి తరువాత రెండేళ్లు సినిమాలకు దూరంగా వున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడి సినిమా కూడా వుంది. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కూడా  స్టార్ట్ కాగా  ప్రస్తుతం రెండో షెడ్యూల్ ను జరుపుకుంటుంది. సుమారు 100కోట్ల బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలక పాత్రలో నటించనుండగా తాజాగా ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ను విలన్ గా ఎంపిక చేశారని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. అలాగే ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్ నటించనుందని  ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో ఈసినిమా విడుదలకానుంది. 
 
ఇక ఈ సినిమా కన్నా ముందుగానే పవన్ .. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో  పింక్ రీమేక్ ను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. ఈసినిమా కు వకీల్ సాబ్ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఎస్ ఎస్ థమన్  సంగీతం అందిస్తున్నాడు. అతి త్వరలో ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ను విడుదలచేయనున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రం మే లో విడుదలకానుంది. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తరువాత పవన్ ,హరీష్ శంకర్ తో తన 28వ సినిమా చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇంతకుముందు పవన్-హరీష్ కాంబో లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: