టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవిది కలెక్షన్ కింగ్ మోహన్ బాబుది నాలుగు దశాబ్దాల స్నేహబంధం. వీరిద్దరు గత నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేకమైన పేజీని నిర్మించుకున్నారు. కెరీర్ ఆరంభంలో మోహన్ బాబు, చిరంజీవి సినిమాల్లో విలన్ గా వేషాలు వేశాడు. ఆ తర్వాత హీరోగా మరి  ఎన్నో సూపర్‌ డూపర్ హిట్ సినిమాల్లో నటించడం తో పాటు నిర్మాతగా కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ హీరోల వారసులు సైతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.

 

 ఎంతో అనుబంధం తో ఉండే ఈ ఇద్దరు హీరోల మధ్య తొలిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నిర్వహించిన వజ్రోత్సవాల సమయంలో బయట పడింది. ఆ మీటింగ్ లో మోహన్ బాబు నేరుగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అదే సభలో చిరంజీవి సైతం ఎంతో ఆవేశంతో మాట్లాడారు. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఈ ఇద్దరు హీరోలు ఉప్పు నిప్పుగా ఉన్నారు.

 

అయితే ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ ఒక్కటై పోయారు. ఎక్కడ కనపడినా ఒకరి పై ఒకరు  చేతులు వేసుకుని ఆలింగనం చేసుకుంటూ.. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. అసలు నాలుగు దశాబ్దాలుగా ఎంతో స్నేహితులుగా ఉన్నా ఈ ఇద్దరు హీరోల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది వీరి గ్యాప్‌కు కారణమైన వ్యక్తి ఎవరంటే. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ తమ ఇద్దరి మధ్య లేనిపోని మాటలు చెప్పి తనను చిరంజీవి నుంచి దూరం చేశాడని.. మోహన్ బాబు ఒకసారి బహిరంగంగానే చెప్పారు. అరవింద చేసిన చర్యల వల్లే చిరంజీవి తనను అనుమానించాల్సిన పరిస్థితి వచ్చిందని.. కూడా మోహన్‌బాబు వాపోయాడు. అలా మధ్యలో చిన్న చిన్న అపార్ధాలు వచ్చినా మోహన్ బాబు చిరంజీవి ది ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ బంధం.

మరింత సమాచారం తెలుసుకోండి: