‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీ గా మారిపోయిన ప్రభాస్ ఏమాత్రం అనుభవం లేని ఒక యంగ్ డైరెక్టర్ ను నమ్ముకుని ‘సాహో’ లో నటించి తీవ్రంగా నష్టపోయాడు. ఆ షాక్ నుండి తేరుకుని ఇప్పుడు కూడ అనుభం లేని జిల్ రాథా కృష్ణ చేస్తున్న ప్రయోగాలకు సంబంధించిన లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. 


‘సాహో’ ఫలితం తరువాత రాథా కృష్ణ తీస్తున్న మూవీ కథలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది దసరాకు రాబోతోంది. ఈ సినిమా ప్రయోగ ఫలితం ఇంకా తేలకుండానే ఇప్పుడు ప్రభాస్ నాగ్ అశ్విన్ తీయబోతున్న మరొక సినిమాకు లైన్ క్లియర్ చేయడంతో ప్రభాస్ మరొక ప్రయోగానికి రెడీ అవుతున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి. 


తెలుస్తున్న సమాచారం మేరకు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీయబోతున్న మూవీ ఒక జానపద కథ అని తెలుస్తోంది. మాయలు మంత్రాలు మంత్ర గాళ్ళతో ఉండే ఈ మూవీ కథ ఒక చందమామ కథలా ఉంటుందని లీకులు వస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీ కథను లోతుగా పరిశీలించిన వారికి ఎన్టీఆర్ తొలి రోజులలో నటించిన ‘పాతాళభైరవి’ ఛాయలు కనిపిస్తాయని వార్తలు వస్తున్నాయి. 


సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెలుగు తమిళ మళయాళ కన్నడ హిందీ భాషలలో ఒకేసారి రిలీజ్ చేస్తారు. గ్రాఫిక్స్ చాల ఎక్కువగా ఉండే ఈ మూవీ నిర్మాణానికి కనీసం ఏడాదిన్నర కాలం పడుతుంది అని అంటున్నారు. వాస్తవానికి నాగ్ అశ్విన్ కు మాస్ హీరోలను డీల్ చేసే సమర్థత లేదు. ఇప్పటి వరకు అతడు తీసిన రెండు సినిమాలు కేవలం మిడిల్ రేంజ్ సినిమాలు మాత్రమే ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రముఖ దర్శకుడుని నమ్ముకోకుండా కేవలం రెండు సినిమాలు తీసిన నాగ్ అశ్విన్ ను నమ్ముకుని ప్రభాస్ మరొకసారి పొరపాటు చేస్తున్నాడు అంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: