టాలీవుడ్ జనాల గురించి ఏదైనా చిన్న వార్త వచ్చినా సరే జనాలు చూపించే ఆసక్తి అంతా ఇంతా కాదు అనేది వాస్తవం. అనవసరంగా వారి మీద లేని పోనీ వార్తలు రాస్తూ సందడి చేస్తూ ఉంటారు మీడియా వాళ్ళు. సిని పరిశ్రమ మొదటి నుంచి కూడా ఇదే విధానం జరుగుతుంది. కనీసం వాళ్ళ బాధను కూడా అర్ధం చేసుకోకుండా రాస్తూ ఉంటారు కథనాలు. ఇలాగే ఒకప్పుడు రోజా, బాలకృష్ణ, విజయ శాంతి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉండేవి. ముఖ్యంగా విజయశాంతి, బాలకృష్ణ మీద ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉండేది. 

 

వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చేవి. ఈ సమయంలో వీరి మధ్య రోజా చిచ్చుపెట్టారు అనే వార్త కూడా వచ్చింది. విజయశాంతి, బాలకృష్ణ ప్రేమలో ఉండగా రోజా బాలకృష్ణ జీవితంలోకి వచ్చారని, అలా వారి మధ్య గొడవ జరిగింది అని, ఆ తర్వాత ఒక సినీ పెద్ద జోక్యం చేసుకున్నారని అనే వాళ్ళు. వాస్తవానికి బాలకృష్ణ విజయశాంతి పెళ్లి చేసుకునే అవకాశం ఉందని కథనాలు కూడా వచ్చాయి. ఆ పెళ్ళికి బాలకృష్ణ తండ్రి అడ్డుపడ్డారని అందుకే ఆ పెళ్లి ఆగిపోయింది అంటూ కొందరు ప్రచారం ఎక్కువగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

 

రోజా ఎంటర్ అవ్వడంతోనే బాలకృష్ణ, విజయశాంతి మధ్య గొడవలు వచ్చి విడిపోయారని, అందుకే పెళ్లి జరగలేదు అనేది కొందరి మాట. ఇది ఎంత వరకు నిజం అనేది ఎవరికి తెలియదు. కాని ఒకరు ప్రచారం చేయగానే దాన్ని మరింత ఉదృతంగా ప్రచారం చేసే వాళ్ళు. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా కూడా బాలకృష్ణకు రోజా కూడా ఈ విషయం లో గొడవ కూడా జరిగిందని చెప్పే వాళ్ళు, ప్రస్తుతం బాలకృష్ణ, రోజా ఎవరి కుటుంబాలతో వాళ్ళు సంతోషంగా ఉండగా విజయశాంతి ఒంటరిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: