మెగా ఫ్యామిలీ అంటే అందులోనే అల్లు కుటుంబం కూడా కలిసి ఉంటుందని భావిస్తారు అభిమానులు. ఎన్నో ఏళ్లుగా ఇదే నమ్మకంతో ఉన్నారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులు కూడా ఒకే కుటుంబంలా కలిసి ఉండేవారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ స్టార్ హీరోగా ఎదిగిన తరువాత రెండు కుటుంబాల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది.

 

ముఖ్యంగా ఓ సినిమా వేడుకలో పవన్‌ అభిమానులను ఉద్దేశిస్తూ చెప్పను బ్రదర్‌ అనటంతో మెగా వర్సెస్‌ అల్లు వివాదం తెర మీదకు వచ్చింది. పవన్‌ అభిమానులు బన్నీ టార్గెట్ చేయటంతో వివాదం మరింత ముదిరింది. అదే సమయంలో  కథ ఎంపికలో అల్లు అరవింద్‌ చరణ్‌ను ఇబ్బంది పెడుతున్నాడని, మంచి కథలను బన్నీకే వచ్చేలా లాబీయింగ్ చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరిందన్న టాక్‌ వినిపించింది.

 

గతంలో మెగా అభిమానులే అల్లు అర్జున్‌ సినిమాల రిలీజ్‌ సమయంలోనూ సందడి చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కొద్ది రోజుల క్రితం అల్లు ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ ఏర్పాటైంది. తాజాగా అల వైకుంఠపురములో సినిమా రిలీజ్‌ సమయంలో అదే సినిమాకు పోటిగా రిలీజ్‌ అయిన సరిలేరు నీకెవ్వరు వేడుకకు చిరు హాజరు కావటం, అల వైకుంఠపురములో సినిమాలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగ్‌లు కూడా ఉండటంతో నిజంగానే అల్లు, మెగా కుటుంబాల మధ్య ఏదో జరుగుతోందన్న చర్చ కాస్త గట్టిగానే జరుగుతోంది. అయితే ఈ రెండు కుటుంబాలు మాత్రం వివాదం విషయంలో ఎలాంటి కామెంట్‌ చేయకుండా మౌనంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: