సూపర్ స్టార్ మహేష్ బాబు తాను సినిమాలకు తీసుకునే పారితోషికం విషయంలో చాల ఖచ్చితంగా ఉంటాడు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు ఉన్నంత ఉదారగుణం లేదు అంటూ మహేష్ ఓపెన్ గానే చెప్పాడు. ఇలాంటి పరిస్థితులలో వంశీ పైడిపల్లి మహేష్మూవీ ప్రాజెక్ట్ అటకెక్కడానికి అసలు కారకుడు దిల్ రాజ్ అంటూ ఇప్పుడు లేటెస్ట్ గా వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.


సాధారణంగా టాప్ హీరోలు అందరు తమ గత చిత్రానికి తీసుకున్న పారితోషికం కంటే కనీసం ఒక కోటి రూపాయలు అదనంగా తదుపరి చిత్రానికి తీసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. దీనితో టాప్ హీరోలకు సంబంధించి పారితోషికం ప్రతి సినిమాకు పెరిగి పోతూనే ఉంది. 


అయితే దిల్ రాజు మాత్రం ప్రాక్టికల్ మనిషి హిట్ సినిమా తీసినా కానీ తనకి మిగిలేది ఏమి ఉండదంటే ఆ రిస్క్ చేయడానికి అతను ఇష్టపడడు. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘మహర్షి’ సినిమాలను మహేష్ తో తీసిన దిల్ రాజ్ కు ఆ సినిమాలు హిట్ అయినప్పటికీ పెద్దగా లాభం రాలేదు అన్న వార్తలు ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దిల్ రాజ్ మహేష్ ను తన లేటెస్ట్ మూవీకి సంబంధించి కొద్దిగా పారితోషికం తగ్గించుకుని తనకు సహకరించమని కోరాడట.


ఈ అనుకోని మాటలను దిల్ రాజ్ నోటివెంట విన్న మహేష్ వెంటనే స్పందించకుండా నవ్వుతూ వంశీ పైడిపల్లి చెప్పే కథ పూర్తిగా విన్న తరువాత ఈ విషయం ఆలోచిద్దాం అన్నాడట. అయితే ఆ మరునాడే మహేష్ కు వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చలేదనీ అసలు ఈ ప్రాజెక్ట్ ఉండదనే న్యూస్ లీక్ చేయించాడు. ఎవరైతే తనకి ‘సరిలేరు’ కు  ఇచ్చిన పారితోషికంతో సమానంగా ఇస్తారో వారితో సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నట్లు టాక్. దీనితో మహేష్ ‘మన దగ్గర బేరాలేవమ్మా’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో చెప్పిన డైలాగ్ ను పూర్తిగా పాటిస్తున్నాడు అంటూ జోక్స్ పడుతున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: