టాలీవుడ్ హీరోలకు మల్టీ స్టారర్ సినిమాల మీద మక్కువ ఎక్కువ కావడంతో ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాలకు సంబంధించిన ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. పలానా స్టార్ హీరోతో పలానా హీరో సినిమా అంటూ ఏదోక వార్త వస్తూనే ఉంది ఈ మధ్య. ఈ నేపధ్యంలోనే మహేష్ బాబు, ప్రభాస్ మల్టీ సరార్ సినిమా వస్తుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాజమౌళి ఈ మల్టీ స్టారర్ సినిమా మీద ఎక్కువగా దృష్టి పెట్టారని, ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమా అవ్వగానే ఈ సినిమా వస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. 

 

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కనీసం వాళ్ళ నుంచి ఏ సంకేతం కూడా రాలేదు. దానికి తోడు ప్రభాస్ రెండు సినిమాలు ఓకే చేస్తే, మహేష్ బాబు మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. వీళ్ళు మరో రెండు మూడేళ్ళు ఎవరికి అందుబాటులో ఉండే అవకాశం లేదు. మరి రాజమౌళిసినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తారో చెప్పలేదు. దీనితో ఆ సినిమా నిజమా కాదా అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి. ఇక ఈ సినిమా కథను కూడా డిసైడ్ చేసారు కొందరు. ప్రభాస్ వీరుడిగా నటిస్తే మహేష్ బాబు విలన్ గా నటిస్తాడు అంటూ కథనాలు వచ్చాయి. 

 

అది ఎంత వరకు నిజం అనేది స్పష్టంగా తెలియకపోయినా సరే సోషల్ మీడియా లో అభిమానులు చేస్తున్న హడావుడి మాత్రం ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాకు నిర్మాతగా రానా ఉంటాడని కూడా ప్రచారం ఎక్కువగా చేసారు. ఇప్పటికే రాజమౌళి తో కలిసి చర్చించాడు అంటూ ప్రచారం ఎక్కువగా చేసారు. రానా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను చేయడానికి రెడీ అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: