గత కొంత కాలంగా ఒక్క హిట్ కోసం ఆరాట పడుతున్న హీరో నితిన్. తాజాగా ఈ హీరో నటించిన  లేటెస్ట్ సినిమా భీష్మ తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెల్సిందే.  వెంకి కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.  వీరిద్దరి జోడీకి ఆడియన్స్ బాగా ఫిదా అయ్యారు.  ఈ సినిమా మీద మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉండగా తొలిరోజు కలెక్షన్స్ కూడా అదరగొట్టింది. నితిన్ కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. వీక్ డేస్ మొదలయ్యే నాటికి కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది.  ఉగాది దాకా ఎదురులేకపోవడం కలిసొచ్చే అంశం.

 

నాని నటించిన v విడుదలయ్యేవరకూ భీష్మను ఎఫెక్ట్ చేసే రేంజ్ లో సినిమా ఏదీ విడుదల కావట్లేదు. సో, నితిన్ కు భారీ హిట్ అందుకోవడం పెద్ద కష్టమేం కాకపోదు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 23 కోట్లకు పైన విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 19 కోట్లను వసూలు చేసింది. యూఎస్ లో భీష్మ 1 మిలియన్ డాలర్స్ వైపు అడుగులు వేస్తుంది.  ఇదిలా ఉంటే.. ఆన్ లైన్‌లో మాత్రం అప్పుడే పైర‌సీ లింక్ పెట్టేసి ద‌ర్శ‌క నిర్మాత‌ల పొట్ట కొడుతున్నారు కొన్ని సైట్లు. అయినా ఈ రోజుల్లో సినిమా విడుద‌లైన త‌ర్వాత పైర‌సీ ఆప‌డం ఎవ‌రి వ‌ల్లా కావ‌డం లేదు.   ఈ నెల 21 విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకపోతున్న భీష్మ సినిమా ఓ బస్సులో దర్శనం ఇచ్చింది.

 

అయితే ఇది చుసిన ఓ ప్రయాణికుడు దానికి సంబంధించిన ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ భీష్మ దర్శకుడు వెంకీ కుడుములకు ట్యాగ్  చేసాడు.  వెంటనే స్పందించిన డైరెక్టర్ దయ చేసి తమ కష్టాన్ని ఇలా చూడకండి. ఈ పైరసీ ని నిషేధించండి అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు. అంతే కాదు మాకు ఏదైనా సమస్య వస్తే ట్యాగ్ చేయాలనిపించే ఒకే ఒక వ్యక్తి  మీరే అంటూ మంత్రి కే.టి.ఆర్ ను ట్యాగ్ చేసాడు.  మరి ఈ విషయంలో కేటీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: