పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. సినిమా రంగానికి దూరంగా ఉండాలని అనుకున్నా కొన్ని కారణాల వలన దూరంగా ఉండలేకపోతున్నారు. తనకు ఆదాయం లభించే రంగం సినిమా రంగం ఒక్కటే అని అక్కడ సంపాదించి రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నానని, తనకు ఇతర ఆదాయ మార్గాలు ఏవి లేవని ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను చాలామంది అంగీకరించారు.
పవన్ కు అండగా ఉంటూ అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన 26 వ సినిమా పింక్ రీమేక్ షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. వీలైనంత ఫాస్ట్ గా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్. ఈ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ 27 వ సినిమా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యింది. సినిమాను కూడా వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాను క్రిష్ పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు. కథను యూనివర్సల్ సబ్జెట్ కాబట్టి పాన్ ఇండియా సినిమాగా తీయాలని అనుకున్నారు. అందుకోసం ఇందులో బాలీవుడ్ నుంచి కొందరు నటీనటులను ఎంపిక చేసుకున్నారు.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జాక్వెలిన్ తో పాటు అర్జున్ రాంపాల్ కూడా ఈ సినిమాలో చేస్తున్నారట. ఇందులో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని, అది ఎవరు ఏంటి అన్నది త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. పవన్ 26, 27 సినిమాల షూటింగ్ లను వరసగా చేస్తూ బిజీ అయ్యారు. క్రిష్ సినిమా పీరియాడికల్ స్టోరీగా తీస్తున్నారని సమాచారం.