క్రేజీ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం తెలుగు కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ సంవత్సరం  ఈమె నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వరస విజయాలు అందుకోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈమె పైనే ఉంది. త్వరలో ప్రారంభం కాబోతున్న సుకుమార్ అల్లు అర్జున్ ల మూవీలో ఈమె హీరోయిన్ గా నటిస్తూ ఉంటే ఈమెను జూనియర్ పక్కన హీరోయిన్  గా పెట్టాలని ఇప్పటికీ త్రివిక్రమ్ గట్టి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. 


తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి రష్మిక సోషల్ మీడియాలో కూడ తెగ సందడి చేస్తోంది. ఈమధ్య ఈమె తనకు తమిళ కమెడియన్ వడివేలు అంటే  తనకెంతో ఇష్టమని చెప్పగా కొన్నికొన్ని సందర్భాలలో రష్మిక ఇచ్చే పోజులు లేడీ కమెడియన్ లానే అనిపిస్తున్నాయి అంటూ రష్మిక పై ట్రోలింగ్ కొనసాగుతోంది. 


ఇది ఇలా కొనసాగుతూ ఉండగా ఈమధ్య రష్మిక పై జరిగిన ఇన్ కమ్ టాక్స్ దాడులను ఉదాహరిస్తూ రష్మిక ఇంటిలో 200 కోట్లకు సంబంధించిన ఆస్థి పత్రాలు దొరికాయి అంటూ కన్నడ మీడియా లేటెస్ట్ గా రష్మిక పై కథనాలు ప్రచురిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈమధ్య ఇన్ కమ్ టాక్స్ ఎంక్వైరీకి హాజరైన రష్మిక తాను ఇప్పటి వరకు తెలుగులో 6 సినిమాలలో నటించినా రెండు సినిమాలకు సంబంధించి మాత్రమే తనకు కోటి రూపాయల రేంజ్ లో పారితోషికం ఇచ్చినట్లు మిగతా సినిమాల నిర్మాతలు తనకు చాల తక్కువ పారితోషికం ఇచ్చారు అని పేర్కొన్నట్లు టాక్.


ఇలాంటి పరిస్థితులలో 200 కోట్ల స్థిరాస్థి పత్రాలు ఎక్కడ నుంచి వచ్చాయి అని టాక్స్ అధికారులు గుచ్చి గుచ్చి అడిగినా డైరెక్ట్ సమాధానం ఇవ్వకుండా మేనేజ్ చేసిందని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో రష్మిక ఆస్థుల వ్యవహారంలో మరింత లోతైన విచారణ చేయాలని టాక్స్ అధికారులు రష్మిక ఆస్థుల మూలాల పై లోతైన విచారణ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కన్నడ రాజకీయాలను ఒక చక్రం తిప్పుతున్న ఒక ప్రముఖ వ్యక్తి రష్మిక ఆస్థుల వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరగకుండా పైపై విచారణతో సరిపెట్టే వ్యూహాలు అనుసరిస్తున్నట్లు కన్నడ మీడియా వార్తలు రాస్తోంది ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా కేవలం 7 తెలుగు సినిమాలలో నటించిన రష్మికకు ఇంత భారీ ఆస్థులు ఎలా వచ్చాయి అన్న విషయమై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉందని కన్నడ మీడియా అభిప్రాయ పడుతోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: